Ads

Showing posts with label Mythological Videos. Show all posts
Showing posts with label Mythological Videos. Show all posts

09 December, 2020

శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! 5 Mothers of Lord Krishna!


కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, 

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం |

సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ,

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి ||

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]

శ్రీకృష్ణుడంటే హిందూమతానికీ, హిందూధర్మానికీ అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తుకురాకుండా, హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చు. అంతేకాదు, నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా, శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. పెదవులపై వేణువూ, మెడపై పసుపూ, తలపై నెమలి ఫించంతో కనిపిస్తూ, సర్వకళలనూ తనలో మిళితం చేసుకుని, సర్వ మానవాళి శ్రేయస్సుకై, శ్రీ హరి ఎత్తిన అవతారమే శ్రీ కృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, ఈ భూమిపై ఉన్నంత కాలం, మానవ సంక్షేమం కోసమే తన జీవనం కొనసాగించాడు. అంతే కాకుండా, సహయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకున్నాడు. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీ కృష్ణుడు, ప్రతీ ఒక్కరి కష్టాలనూ కడతేర్చే భగవద్గీత అనే దివ్య జ్ఞానాన్ని మనకందించాడు. చిన్నతనంలో, గోకులంలో చేసిన ఆయన లీలలకు, ఎంతో మంది ఆకర్షితులయ్యారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం, అష్టమి తిథిన, రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి, వసుదేవుని భార్య అయిన దేవకి కన్న తల్లిగా, నందుని భార్య యశోదమ్మ పెంచిన తల్లిగా, అందరికీ తెలుసు. కానీ, కన్నయ్యకు మొత్తం ఐదుగురు తల్లులు ఉన్నారు. దేవకీ, యశోద కాకుండా మరో ముగ్గురుని, ఆ కృష్ణ భగవానుడు తనకు మాతృసమానులుగా భావించాడు. మరి శ్రీ కృష్ణుడి తల్లులైన ఆ మిగతా ముగ్గురి గురించి కూడా, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

1. దేవకి

వసుదేవుడి సతీమణి అయిన దేవకి, శ్రీ కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు, చెరసాలలో బంధించిన నేపథ్యంలో, శ్రావణ మాసంలో, కృష్ణ పక్షం, అష్టమి తిథిన, కంసుడి కారగారంలోనే, కన్నయ్యకు జన్మనిచ్చింది, దేవకీ మాత. దేవకి, మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు, దేవకిని అల్లారుముద్దుగా చూసుకుని, ప్రేమగా ఆదరించాడు. కానీ, దేవకికి వసుదేవునితో పెళ్లై వెళ్లబోతుండగా, ఆకాశవాణి పలుకులతో ఆగ్రాహావేశుడయ్యాడు. దేవకి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని, దేవకినీ, ఆమె భర్త వసుదేవుడినీ, చెరసాలలో బంధించాడు. దేవకిని, దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా కొందరు భావిస్తారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకున్న కారణంగా, శ్రీ కృష్ణుడిని, దేవకీ నందనుడూ, వాసుదేవుడూ అని పిలుస్తారు.

2. యశోద

కృష్ణయ్యకు జన్మనివ్వకపోయినా, కంటికి రెప్పలా చూసుకుంది, యశోద. గోకులంలోని గ్రామ పెద్దయిన నందుడికి భార్య యశోద. కంసుడి బారి నుండి తప్పించడానికి, తండ్రి వసుదేవుడు, వీరింట కన్నయ్యను విడిచివెళ్ళాడు. తన అల్లరి పనులతో, ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో, యశోద చెంతనే పెరిగాడు కృష్ణుడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు, తన నోట చతుర్దశ భువనభాండాలను చూపి, ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేశాడు చిన్ని కృష్ణయ్య. భాగవతం ప్రకారం, యశోదకు కలిగి అదృష్టం, ముక్తీ, ఆ బ్రహ్మా, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి, అతడిని మందలిస్తూనే, ఎంతో ప్రేమగా చూసుకున్న యశోదమ్మ, కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.

3. రోహణి

వసుదేవుడు, దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకున్నాడు. బలరాముడూ, సుభద్రా, ఏకాంగి దేవీ, వీరి సంతానం. దేవకీ-వసుదేవుల ఏడవ సంతానాన్ని, రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా, ఆమెకు బలరాముడు జన్మించాడు. రోహిణి, తన కుమార్తే, కుమారుడితో కలిసి, యశోద దగ్గర నివసించేది. శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడూ, ఆయన సవతి తల్లి అయిన రోహిణీ, నాగ జాతికి చెందిన వారని, కొంతమంది అభిప్రాయం. అంతేకాకుండా, హస్తినాపురానికి రాజైన శాంతనవుడి సోదరుడు బాహిలిక కుమార్తె రోహిణి అని, మరికొంత మంది వాదన.

4. సుముఖి దేవి

సాందీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా, తల్లి హోదా ఇచ్చాడు, శ్రీ కృష్ణుడు. ఎందుకంటే, కృష్ణుడూ, బలరాముడూ, సుదాముడూ, సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే, సుముఖి దేవి, కృష్ణుడిని తన కుమారుడుగా ఉండమని, గురు దక్షిణ అడిగింది. అందుకు కారణం, శంఖాసురుడి అధీనంలో ఉన్న ఆమెను, అతడి చెర నుంచి విడిపించినందుకు, మాధవుడిని పుత్ర సమానుడిగా భావించింది. కన్నయ్యకు గురమాతైన సుముఖీ దేవి, ‘నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవ్వద’ని ఆశీర్వదించింది. అందుకే, కృష్ణుడు తనువు చాలించేవరకూ, ఆయన తల్లైన దేవకి కూడా జీవించే ఉంది.

5. పూతన

శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు, కంసుడు పూతన అనే రాక్షసిని పంపాడు. పాలు త్రాగే వయస్సులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వచ్చి, తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని, చిన్ని కృష్ణుడిని చంపాలని చూసింది. అయితే, పసిరూపంలో ఉన్న కన్నయ్య, ఆ విషయాన్ని ముందే గ్రహించి, రొమ్ముల ద్వారా పాలతో పాటు, రక్తాన్ని పీల్చి ఆమెను హతమార్చాడు. పూతన మరణం తర్వాత, ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో, ఆమె శరీరం, గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీని గురించిన వివరణ, భాగవతంలో సమగ్రంగా పేర్కొనబడింది. రాక్షసైన పూతన చనుబాలు త్రాగిన కృష్ణుడు, ఆమెకు కూడా తల్లి హోదా ఇచ్చినట్లు వివరించబడి ఉంది.

ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమా, అమ్మ కంటే గొప్ప భద్రతా ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మాతృ దేవో భవ!

Link: https://www.youtube.com/post/Ugx5Tq2zcPEj2y7mSYh4AaABCQ

25 November, 2020

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! The Day Krishna Left His Body | MPlanetLeaf


Mysterious Facts about Death of Lord Krishna | విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! | M Planet Leaf (MPL) Videos Exclusive...

OUR LINKS:

►SUBSCRIBE TO OUR MPL (Channel) :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://goo.gl/ZTwU1K

Some of those lesser known facts about the end of Lord Krishna avatar...

18 February 3102 BCE Friday. The day the earth stood still. It was an afternoon as the bright big sun was shining through the leaves in the forest. The sky was clear and the hour was serene.

The place was the forest on the banks of river Hiran in Prabhas Patan theertham (the junction point where Gomati River joins the sea).

He decided that it was time for pay off the Karma to take effect and so he sat down to meditate while exposing his left foot. He knew what was going to happen.

For, he was Shri Krishna Vasudeva, the resplendent one, the one who lacked nothing, the one who gave magnificently.

As he was resting by a tree, a hunter mistaking his foot for a deer shot an arrow through it. Krishna got shot in his left foot.

When he neared what he thought was his kill, the hunter, named Jara, was shocked to find Krishna, dressed in yellow robes, lying there. On realizing his grave error he was filled with remorse and grief.

He was horrified and fell at Krishna’s feet, begging for mercy.

The dying Krishna told him in a compassionate voice: “It is not your fault, it was destined to happen. Don’t be scared or sorry as these are the ways of destiny.”

These were the great man’s last words on earth.

For, Krishna knew the law of Karma is universal. Even gods and avatars are subject to it. As a magic, Krishna’s voice told Jara from inside: “You need not repent, because you were Bali in your previous birth and I as Rama had killed you in Tretayuga. Now, I have to leave this body and was waiting for an opportunity to end my life. I was waiting for you so that the karmic debt between you and me is finished. Since all acts in this world are done as desired and designed, you need not worry for this”.

Blessing him, Krishna then breathed His last at 14 hours, 27 minutes and 30 seconds.

His death marked the end of Dwapar Yuga (Era). The period after his disappearance has great significance in the history of earth – it marks first day of Kali Yug.

Krishna had predicted that exactly seven days after his disappearance, the Golden city of Dwarka, founded by Krishna, in Gujarat will drown in the sea. Indeed Dwarka city had been merged in sea owing to torrential rain.

Just before that most of Yadus (Yadavs – the clan of Krishna) had already died in the war of Prabhas. 36 years prior to that, Gandhari, wife of Dhritarasta, had cursed Krishna that his clan would also finish like Kauravas, her 100 sons who were totally wiped out in the great Kurukshetra war.

After Dwarka sank, rest of the Yadus children and pregnant women went back to Mathura.

For those who do not know about Gandhari’s curse: After the end of Mahabharata war Krishna visited Mother Gandhari to offer his condolence. On seeing him she cursed Krishna “Just as these Kshatriyas (warriors) slew one another, so would your Yadua race perish, killing one another. As for you, you would meet with an inglorious end in the wilderness. This is my curse on you.”

Krishna happily accepted the curse. He replied, “Your curse will certainly take its course since you are endowed with great virtue.”

Krishna told Gandhari: “Mother, but you have wasted your energies on this curse. I am not going to leave Yadus too, because my purpose is to end Adharma. Even if they are my kith and kin I won’t spare any of them.”

Yes- Krishna’s fight was against Adharma. And there was no room for nepotism or attachment. And as he predicted, Yadu clans, including Krishna’s own sons, fought each other and died….

Arjuna (Krishna’s cousin and friend) reached Dwaraka hearing Krishna’s disappearance and the in-fight of Yadus out of ignorance, greed and arrogance. He couldn’t do anything. Meanwhile, the hunter Jara approached Arjuna, Krishna’s charioteer Daruka and the priests (who came to perform last rites of dead Yadus) lead them to the place where the body of Krishna was lying.

Beholding the mortal body of Krishna, Arjuna fell down with great grief. He hugged the body of Krishna and began to cry loudly. He lost all his courage and was crying like a child. He was not able to bear that fact that his great friend left him.

Arjuna cremated the mortal body of Sri Krishna in the deep forest.

Much more is explained in Telugu in our above video. Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #PlanetLeaf #MPL #Hinduism #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం #historical

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు!

 

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్‌!

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!!

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ సమయంలో, ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా? ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా, ఈ కోవిడ్ సమయంలో ప్రాణం విడిస్తే, కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ‘ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్రలో పట్టుమని, పదిమంది కూడా లేకుండానా?’ అని చాలామంది, మరింతగా కృంగిపోతూ ఉంటారు. అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి సమయాల్లో, ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం, క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.

ఎక్కడో ద్వారక.. దానికి చాలా దూరంలో తపోవనం.. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ, బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య, ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 

ఆ కార్యక్రమం ముగిశాక, అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని, వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు.. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాకూడదని కూడా అనుకున్నాడు. అర్జునిడితో పాటున్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే, అర్జునుడిని ఓదార్చారు. 

అప్పటికే శ్రీకృష్ణుడు, ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల, దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇప్పటి కరోనాలాగానే, అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది. ఆ విషయం మరో వీడియోలో తెలుసుకుందాము. 

సరిగ్గా అప్పుడే ద్వారక సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉండడంతో, ఇక ఆ జీవం లేని దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక, అక్కడే, అర్జునుడొక్కడే, అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి, అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప, ఇంకెవ్వరూ లేరు. 

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి, ఇద్దరు కొడుకులున్నా, వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలూ, ఊరటలూ, మార్గనిర్దేశకాలూ అవుతాయనడానికి, ఇదొక ఉదాహరణ. 

మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు, ఎవరికి, ఎలా నిర్ణయిస్తుందో, ఎవరూ చెప్పలేరు. అంతా దైవేఛ్ఛగా భావించి, ముందుకు సాగిపోతూ ఉండడమే. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgzIvT0iVN-GvHBdjON4AaABCQ

22 November, 2020

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!



తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nq9T9mD0Cng ]

ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది. 

కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు. 

పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.

అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’ అనే వీడియోను చూడండి. వీడియో లింక్, క్రింద పొందుపరిచాను. అది కనిపించని వారు కామెంట్ చేస్తే, రిప్లైలో లింక్ పంపిస్తాను.. 

[ Link: మరణం తర్వాత ఏం జరుగుతుంది? - https://www.youtube.com/watch?v=lOH5s... ]

ధర్మో రక్షతి రక్షితః!

20 November, 2020

దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

 


దేవతలనే శపించగలిగే మునులు, రాక్షసులు దాడి చేస్తే దేవుళ్ళ సహాయం ఎందుకు కోరేవారు?

నిజమే! శపిస్తే పోతారు. కానీ, వారికి ఆ అధికారం లేదు కాబట్టి, శపించరు. ఎందుకు ఇలా? అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం ఈ విషయం తర్కించి చూద్దాం. కొన్ని ఉదాహరణలు తీసుకుని, ఈ తర్కం తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1UPRUEqFKdI ]

ముందుగా విశ్వామిత్రుడిని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మర్షి అయినాడు. ఆయన కోపం వలన, కామం వలన, ఎన్నో సార్లు తన తపః శక్తిని వృధా చేసుకుని, ప్రాయశ్చిత్తంగా, మరల కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి, పూర్వపు స్థితికి చేరుకోగలిగాడు. ఆయన క్రోధం వహించి, తాను చేస్తున్న యాగం సంపూర్ణం చెయ్యడానికి, ఆ రాక్షసులను ఒక్క హుంకారంతో చంపి వెయ్యగలడు.. కానీ, దాని వలన ఆయన చేస్తున్న యాగం, ఆ యాగసంకల్పం  సంపూర్ణం కాదని, ఆయనే స్వయంగా చెప్పారు.

ఆయనే తన వద్దనున్న బల-అతిబల విద్యలను, ఎన్నో దివ్యాస్త్రాలను సమంత్రకంగా రామునికి ఉపదేశించి, ఆయన నుండి రక్షణ కోరాడు. ఇందులో ఎన్నో దైవరహస్యాలు దాగి ఉన్నాయి.

1. పరమాత్ముడు శ్రీరాముని అవతారం తీసుకుని వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆయనకు తన వద్దనున్న విద్యలన్నీ ధారబోసి, సర్వస్వ శరణాగతి కోరాడు
2. రామునికి విద్య నేర్పి దివ్యాస్త్రాలు ఇవ్వవలసిన గొప్ప బాధ్యతను ఆయనకు అప్పజెప్పారు. ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారు. 
3. రావణుడు కేవలం మానవుల, వానరుల చేతిలో మరణించే అవకాశం మాత్రమే ఉంది. రావణుని అడ్డు పెట్టి, ధర్మవర్తన అందరికీ తెలుపవలసిన దివ్యనాటక రచనలో, ఆయన తన పాత్రను పోషించాలి.
4. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా, అతడు చేస్తున్న దుందుడుకు కార్యాలకు చావమని శాపం ఇవ్వక, పడతి అనుమతి లేకుండా, వారిని మరోలా తాకితే, తల వెయ్యి ముక్కలు అయ్యే శాపం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే, ఆయన పాత్ర కూడా, కేవలం అక్కడితో ఆగిపోతుంది. చెయ్యవలసిన కార్యం కోసం, రావణుడిని అడ్డుపెట్టుకుని, ఈ భూమి పై అడుగుపెట్టి, ధర్మాన్ని నిలుపవలసిన మహత్కార్యం ఉంది. 
5. ఆ మాటకు వస్తే, రావణుడు వాలి చేతిలోనూ, కార్తవీర్యార్జునుని చేతిలోనూ దారుణంగా నిహతుడు అయ్యే అవకాశం ఉన్నా, వారి పరిమితికి లోబడి, వారు కేవలం ఆ రాక్షసుని చెర మాత్రమే పట్టి, ఇతరుల ఆదేశం మేరకు వదిలేసారు.
6. ఒకవేళ రావణుడంతటి రాక్షసుని చంపవలసి వస్తే, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు ధారబోసి, క్రోధం పూని, అతడిని చంపవచ్చు. కానీ, మరల ఆయనకు అంత ఆయుర్దాయం ఉండడం, అనుకున్న గొప్ప కార్యం నేరవేతుందన్న నమ్మకం ఉందా? కాబట్టి, మహర్షులు తమ క్రోధాన్ని అణగద్రొక్కుకుని, తమకూ, లోకానికీ, రక్షణ ఇచ్చే బాధ్యత ఉన్న ఆ ధరణీపతిని శరణు వేడి, ఆయన చేత రక్షణ పొందారు. 
7. అసలు విశ్వామిత్రునికి ఆ దివ్యాస్త్రాలు, పరబ్రహ్మ అనుమతి వలనా, ఆయన అనుగ్రహం వలనా వచ్చినవే. ఆయన ఇచ్చిన విద్యను ఆయనకే ఇచ్చి, నువ్వు తప్ప నాకు మరొక దిక్కులేదు, నన్ను బ్రోవుమా అనే గొప్ప శరణాగతి తత్త్వం, ఇందులో కనబడుతుంది.  ఎప్పుడూ 'నాదేమీ లేదు, నువ్వే దిక్కు' అని ఆయనను ఆశ్రయిస్తే, గజేంద్రమోక్ష వరదుడు, సంసార కూపం నుండి ఉద్ధరించి, ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు. 
8. ఎవరి పని వారు చెయ్యాలి. రక్షణ చెయ్యడం, క్షత్రియుని బాధ్యత. తపస్సు చేసి, అందరికీ మార్గదర్శనం చెయ్యడం, మహర్షుల కర్తవ్యం. వారికి అప్పజెప్పిన పనిని, అతిక్రమించరు వారు. 
9. ఎవరెవరి కర్మఫలం ఎలా వుందో, వారి విషయంలో, మహర్షులు మామూలుగా జోక్యం చేసుకోరు. ఎవరైతే, ఆ రాక్షసుల చేతిలో బాధలు అనుభవిస్తున్నారో, వారి కర్మఫలం అలా వున్నది. ఎప్పుడైతే వారందరూ స్వామికి శరణాగతి చేస్తారో, అప్పుడు వారిని కాపాడే బాధ్యత ఆయన తీసుకుని, వారిని రక్షిస్తాడు.

ఇంకా ఎన్నో దేవరహస్యాలు ముడిపడి ఉంటాయి. మనకు తార్కికంగా అర్ధం చేసుకోవడానికి ఈ కారణాలు చాలు. 

ఇలా మనం భారతంలోనూ, భాగవతంలోనూ చూస్తే, ఇటువంటి ఎన్నో తార్కాణాలు కనబడతాయి. అన్నింటికీ, పైన చెప్పుకున్న విషయాల కారణంగా, ఋషులు జోక్యం చేసుకోరు. ఒక్కోసారి మరీ అధర్మం పెచ్చరిల్లితే, వారికి అందిన ఆదేశం ప్రకారం, వారు అప్పుడప్పుడు దండిస్తూ ఉంటారు. ఒకసారి ఇక్ష్వాకు వంశంలో, వేనుడు అన్న వాడి ఆగడాలు మితిమీరిపోతే, వాడికి మంచి బుద్ధులు చెబుదామని వెళ్ళిన ఋషులూ, మునులను బంధించి, కేవలం తననే దైవంగా పూజించమని నిర్బంధించినప్పుడు, వారంతా చేసిన ఒక్క హుంకారానికి ఆ వేనుడు చావగా, అతడిని మధించి, వంశోద్ధారకుని పుట్టించారు. కానీ, ఇటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. ఒకరి పాపం పండినప్పుడు, వారిని అంతం చెయ్యడానికి, దైవమే ఒక అవతారం తీసుకుని, భువికి వస్తారు. అప్పటివరకు, ఎవరి కర్మఫలాలనుబట్టి, అటువంటి నరకబాధలు ఎవరెవరు అనుభవించాలో, వారు వీరి బారిన పడి, బాధలు అనుభవిస్తూ ఉంటారు. 

ఈ ప్రపంచం అంతా, ఆ పరాత్పరుని నియమానికి లోబడి నడుస్తుంది. ఆయన ఆజ్ఞ లేనిదే, ఏదీ జరగదు. ఒకొక్కప్పుడు, దేవతలకు తమలో ఉన్న సత్త్వ గుణాన్ని తొక్కి, రజో, తమో గుణాలు ప్రకోపించినప్పుడు, వాటిని అదుపు చెయ్యడానికి, ఆ పరమాత్మ ప్రతినిధులైన ఆ మహర్షులు, వారిని శపించి, తగిన శాపవిమోచనం బోధించి, వారిని సరైన దారిలో పెడతారు. ఈ రాక్షసులు అలా శాపకారణంగా, వారిలో ఉన్న తమోగుణం పోగోట్టుకోకపోగా, మరింత పెచ్చరిల్లే అవకాశం ఉన్నందున, వారిని దునుమాడవలసిన అవసరం ఉన్నప్పుడు, ఆ పరమాత్ముడిని ఆశ్రయించక తప్పదు. కాబట్టి, వారు ఏం చేసినా, లోకకళ్యాణం కొరకేగనుక, వారికి అనుమతి ఉన్న కార్యాలు మాత్రమే చేస్తారు, ఆ మహర్షులు. వారి తపః ఫలితంగా, ఆ పరమాత్మ వారికి సశరీరంగా అనుగ్రహించి, వారిని భౌతికంగా రక్షించి, ఆధ్యాత్మికంగా వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. 

ఆ మాటకొస్తే, నేటికి కూడా, అంతటి గొప్ప మహర్షులు మన భారతదేశంలో ఉన్నారు. మన కంచి కామకోటి పీఠాధిపతులు, ఇలలో నడయాడిన పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి, సరైన దారిలో పెట్టారు తప్ప, శపించి వారి శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. ఒక్కసారి మన భౌతిక స్థాయిని దాటి ధ్యానం చేస్తే, మన వాంగ్మయం మీద సంపూర్ణ నమ్మకంతో, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే, ఆ పరమాత్మే మనను అనుగ్రహించి ప్రచోదనం చేస్తారు.

ఓం నమో వేంకటేశాయ!

09 July, 2019

కాల భైర‌వుని ఆవిర్భావం...! | Kala Bhairava: The Lord of Time | MPlanetLeaf



Facts About Kala Bhairava: The Lord of Time | తప్పక తెలుసుకోవలసిన కాల భైర‌వుని ఆవిర్భావం...! | M Planet Leaf (MPL) Videos Exclusive

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/ZTwU1K

Kala Bhairava is a fierce manifestation of Lord Shiva and is highly revered across the Indian subcontinent. He is depicted in an aggressive form with angry eyes shaped like lotus blossoms, blazing hair, tiger’s teeth, snake coiled around his neck or crown, and an eerie garland of human skulls. Often terrifying, Kala Bhairava carries a trident, a drum and the severed fifth head of Brahma. The deity is blue throated from swallowing poison to save the world. Hence, he is considered to be the vanquisher of death. His third eye represents eternal supreme wisdom.

There are many interesting legends surrounding Kala Bhairava, one of the eight avatars of Lord Shiva. The origin of the mighty god is attributed to a tale in the Shiv Mahapurana, wherein Lord Brahma commands Lord Vishnu to worship him, as he is the creator of the universe. This angers Lord Shiva, who is incarnated as Kala Bhairava to punish him and beheads one of Brahma’s five heads. Since then Brahma has four heads while Bhairava carries the fifth. But chopping off Brahma’s head amounted to the killing of a Brahman. Consequently, Bhairava had to carry the gory head with him for 12 years. He wandered like a vagabond, till he was liberated of the sin. Usually the idol of Bhairava depicts him in this frightful form.

The name Bhairava itself is replete with deep meaning. The first syllable ‘Bhai’ means fear and also lustrous light. It is said to endow one with material wealth. ‘Rava ’ means echo. While ‘Ra’ casts off negativity and restricted consciousness, ‘Va’ keeps creating opportunities. In totality Bhairava denotes that by using fear we can attain ‘aseem anand’ or extreme delight.

Despite being one of the most feared deities, he is essentially one of the most rewarding and protective gods. In tantric practices he is sacred as Batuk Bharav. Being a rudra, the Lord is said to be very knowledgeable in tantra-mantra.

Kala Bhairava is also famous for his dog vahana or vehicle. The dog is usually seated on one side, ready to taste the dripping blood from the executed Brahma head. Looking after and feeding dogs is thus considered to be another way of displaying devotion. Bhairava can bestow incredible blessings and the boon of auspicious time to devotees. According to myths, if one feeds hungry dogs with ‘halwa puri’ (sweet bread), then automatically all problems can be overcome.

Kala Bhairava has 8 manifestations, namely Asithaanga Bhairava, Ruru Bhairava, Chanda Bhairava, Krodha Bhairava, Unmattha Bhairava, Kapaala Bhairava, Bheeshana Bhairava and Samhaara Bhairava. He also guards the 52 Shaktipeethas and hence there are said to be 52 forms of Bhairava across the sacred spots. Protecting Shakti is significant for everlasting peace amidst the scenarios of wrath, violence and animosity. Prayers to Lord Kala Bhairava as well as Sarabeswara and Amruta Mrityunjaya are necessary for this safeguarding.

From the Aghoris and Kapalika sect to Gorat Kashmiris, from Assamese tantric practitioners to the Gowdas of Karnataka, from worshippers in Kathmandu to those in Sri Lanka, across diverse communities Kala Bhairava is venerated. The Kashi (Benares) Bhairava is accorded much reverence. Hindu reformer Adi Sankara once wrote a beautiful hymn titled ‘Kala Bhairav Ashtakam’ in honor of the Kashi deity. In the rural milieu of Tamil Nadu, Maharashtra and others, he is believed to be the village protector. The villagers erect decorative statues of ‘grama devata’ at the village entrance.

The word Bhairava itself has considerable prominence in invocations. Chanting the three syllables ‘bhai’, ‘ra’ and ‘va’ is said to create a bounty of benefits. The sacred sound is said to be a reminder that each second is precious and that one should not procrastinate and disrespect time. Instead one must polish oneself by chanting and sharpen ones focus by chanting.

According to many gurus devotees must chant the syllables 8 times a day for a 1 minute each, anytime day or night. One can even chant the mantra more than 108 times or by writing 1008 or 10008 times for great outcomes and protection.Thus, this fearful manifestation of Lord Shiva is believed to be one of the most protective powers blessing for humanity.

Much more is explained in Telugu in our above video. Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#VoiceofMaheedhar #MPlanetLeaf #Bhakti #MaheedharsPlanetLeaf #PMBTV #PlanetLeaf #VoiceofTelugu #MPL #Hinduism #Sanatanadharmam #History #RealFacts #Maheedhar #Mahidhar #Mahidar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం #kalabhairava


01 June, 2019

Amazing Facts on Existence of Viraja River on Tirumala! | వేంకటేశ్వరుని సన్నిధిలోని అద్భుతాలలో దేవనదియైన విరజానది ఆనవాళ్లు! | MPlanetLeaf




Amazing Facts on Existence of Viraja River on Tirumala! | వేంకటేశ్వరుని సన్నిధిలోని అద్భుతాలలో దేవనదియైన విరజానది ఆనవాళ్లు! | M Planet Leaf (MPL) Videos Exclusive

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/ZTwU1K

The marginal line between the material manifestation and the spiritual manifestation is the Virajā River.

SB 2.9.10, Purport: In the Padma Purāṇa, Uttara-khaṇḍa, it is stated that beyond the one-fourth part of God's creation is the three-fourths manifestation. The marginal line between the material manifestation and the spiritual manifestation is the Virajā River, and beyond the Virajā, which is a transcendental current flowing from the perspiration of the body of the Lord, there is the three-fourths manifestation of God's creation. This part is eternal, everlasting, without deterioration, and unlimited, and it contains the highest perfectional stage of living conditions. In the Sāṅkhya-kaumudī it is stated that unalloyed goodness or transcendence is just opposite to the material modes. All living entities there are eternally associated without any break, and the Lord is the chief and prime entity. In the Āgama Purāṇas also, the transcendental abode is described as follows: The associated members there are free to go everywhere within the creation of the Lord, and there is no limit to such creation, particularly in the region of the three-fourths magnitude. Since the nature of that region is unlimited, there is no history of such association, nor is there end of it.

Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #PMBTV #PlanetLeaf #VoiceofTelugu #MPL #Hinduism #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Mahidar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం

27 April, 2019

Shiv Gita Imparted by God Shiva himself to Lord Rama? సాక్ష్యాత్ పరమేశ్వరుడే రాముడికి బోధించిన గీత? M Planet Leaf



Was Shiv Gita Imparted by God Shiva himself to Lord Rama? | సాక్ష్యాత్ పరమేశ్వరుడే రాముడికి బోధించిన గీత! | M Planet Leaf (MPL) Videos Exclusive

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/ZTwU1K

Is Shiva Gita as authentic as Bhagavad Gita? Did Lord Shiva really impart the knowledge of Shiva Gita to Lord Rama?

Yes Shiv Gita is Authentic text. Shiv Gita is mentioned in Padma Purana and the whole incidence is captured by Maha Rishi Ved-Vyasa.

Among the numerous scriptures which teach us the path to Salvation, Shiva Geeta is one of the foremost few among them. Although it didn’t gain popularity as like as Bhagwad Geeta, yet it is always good to learn spirituality irrespective of the popularity of the source. There are 28 Geetas available in our scriptures, like Shiva Geeta, Uttara Geeta, Rudra Geeta, Brahma Geeta, Guru Geeta, Bhagwad Geeta, Devi Geeta, Ganesha Geeta, Avadhuta Gita etc., to name a few. We need to identify which one is the right Geeta for us and follow the same accordingly.

It needs to be mentioned explicitly here that there cannot be a comparison between Shiva Geeta with Bhagwad Geeta or any Geeta as a matter of fact. Every Geeta has a message, a central theme around which it revolves, and a unique style of rendering the message. Bhagwad Gita is a vedantic scripture which is the best because it teaches all round sacred wisdom from upanishads. But that doesn’t mean Shiva Geeta (or any other Geeta) is inferior to that. Shiva Geeta primarily focusses on preaching about lord Shiva who is the parabrahman of Vedas, and it only reveals the path to salvation sailing with the sailor called ‘Shiva’. So, for a normal Hindu (who doesn’t belong to any sect), this would be a good source of wisdom. for a Shiva devotee or a Shaivite this geeta would be like a treasure. Therefore it has to be understood clearly that comparison between geetas is an absurd activity and everyone is expected to learn from this text and remain blissful in the devotion of the Supreme Personality of Godhead – Lord Shiva!

It’s a known fact that Bhagwad Geeta has achieved such a widespread recognition because people have spread it across the world by translating not only in all the Indian languages, but also in foreign languages. Whereas Shiva Geeta has not been caught attention of people since it’s documented in a Purana and not present in the famous epic Mahabharata which gained greater attention of people. Since people usually are acquainted with Epics but rarely read or analyze Puranas, Shiva Geeta skipped gaining popularity among the masses due to the same reason even though both the Geetas are believed to be documented by Veda Vyasa himself.

Shiva Geeta belongs to the Ramayana era of Treta Yuga while Bhagwad Geeta belongs to Mahabharata era of Dwapar yuga. So, Shiva Geeta precedes Bhagwad Geeta in time. However there are certain instances in Shiva Geeta which are different from the instances in Valmiki Ramayana. But one thing which is common is in Valmiki Ramayana as well as in Shiva Geeta, it is the same Sage Agastya who becomes the preceptor of Rama. In Valmiki Ramayana he preaches Rama ‘Aditya Hrudayam’, and in Shiva Geeta he preaches him Viraja-Deeksha Austerity. So, these differences in stories between Valmiki Ramayana and Shiva Geeta could be understood as due to ‘Kalpa Bheda’ (these might belong to different eons). Whatever may be the reality behind the authenticity of Shiva Geeta, it definitely is a text worth learning since the verses are not self-cooked verses, this Shiva Geeta verses actually exist in Upanishads like Svetawsatara, Atharvasiras, kaivalya etc. to name a few. Therefore, reading this Shiva Geeta is as equal as reading the verses of the Upanisahds. So, definitely Shiva Geeta is of a great value to the mankind. Apart from the common chapters, Shiva geeta also states many valuable spiritual things including Shiva yoga or Shiva tattwa.

Following a Geeta is based on one’s personal interest and choice but reading spiritual matter always benefits and increases the devotion towards our beloved God. Hence readers are requested to read through the Shiva Geeta chapters and extract whatever good things are taught by the Lord of the Universe, the greatest Guru-Sri Sada Shiva.

Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #PMBTV #PlanetLeaf #VoiceofTelugu #MPL #Hinduism #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Mahidar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం

సాక్ష్యాత్ పరమేశ్వరుడే రాముడికి బోధించిన గీత!, Was Shiv Gita imparted by God Shiva himself to Lord Rama?, Shiva Geeta chapters, shiva gita in telugu, Padma Purana, Shiva tattwa, maheedhars planet leaf, planet leaf videos, voice of telugu, arunachala siva, mplanetleaf, Maheedhar Vallabhaneni, Shiva yoga, pmb tv videos, Mysteries in Telugu, Facts in Telugu, Mysterious Temples, Voice of Maheedhar, Unknown facts, Interesting facts, planet leaf videos in telugu, M Planet Leaf

04 April, 2019

With Sri Rudram One Can Conquer Death! | మరణాన్ని సహితం అధిగమించగల శత రుద్రీయం!

Sri Rudram is also called "Rudropanishad" and "Shatarudriyam"


రుద్రం విశిష్ఠత 

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు. 

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమకం విశిష్టత :

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

అనువాకం –9:

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

అనువాకం – 10:

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

చమకం విశిష్టత:

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే...

30 March, 2019

గోమాబాయి కథ - Story of Gomabai, Devotee of Lord Pandarinatha! MPlanetLeaf

This story of 'గోమాబాయి' the devotee of Lord Panduranga was published in the monthly magazine 'Anasuya' dated: 1917-07-01. Writer unknown...

చాలా కాలం క్రితం, మాహారాష్ట్రలో గోమాబాయి అనే ఒక పేద పండరీనాథునికి మహాభక్తురాలు ఉండేది. ఆమె ఎప్పుడూ హరినామ సంకీర్తనం, బిక్షాటనతో దేహ పోషణ. అంతే...

వితంతువు, సంతానహీనురాలు, పేదరాలు కావడంతో బిక్షాటన ఒక్కటే గతయ్యింది తనకు. ఎవరైనా చిరిగిన బట్టలు ఇస్తే, చిరుగులు కొట్టుకుని ఆ బట్టలు వేసుకుని ఉండేది. అత్యంత పేదరాలు. తనకు వచ్చిన బిక్షలో తన శరీరపోషణ కు ఎంత అవసరమో అంత ఉంచుకుని, మిగిలినది ఇతర పేదలకు పంచిపెట్టేది. ఒక్కోసారి తనకు వచ్చిన పిండి, బియ్యం లాంటి మూలపదార్థాలు దాచి, ఆ ఊరికి వచ్చిపోయే భాగవత బృందాలకు వండి పెట్టి భాగవత కైంకర్యం చేసేది.


ఒకనాడు పండరీపురం లో మహోత్సవం దర్శించాలని ఆ ఊరినుండి ఎంతో మంది భాగవతులు బృందాలుగా ఏర్పడి వెళ్తున్నారు. అప్పటికే వృద్ధురాలైన గోమాబాయి మళ్ళీ వచ్చే మహోత్సవాల సమయానికి ఉంటానో లేదో అని అనుకుని బయలుదేరడానికి నిశ్చయించుకుంది. తన దగ్గర ఉన్న కొంచెం సత్తుపిండి ని మూటకట్టుకుని రంగా రంగా అని అంటూ కాలినడకన బయలుదేరింది.

మార్గమధ్యంలో ఆకలి అనిపించినప్పుడు కొంచెం పిండితో రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ బయలుదేరేది. అలా నడిచి నడిచి భీమానది తీరం చేరింది. మర్నాడే మహోత్సవ ఆరంభం. భీమనాది పొంగు మీద ఉండడంతో కచ్చితంగా పడవ మీదే తీరం దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోమాబాయి దగ్గర సత్తుపిండి తప్ప ఒక్క కాసు కూడా ధనం లేదు. ధనం ఉన్నవాళ్లు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపురానికి వెళ్తున్నారు. ఈమె దగ్గర ఒక్క కాసు కూడా లేకపోవడం తో రద్దీ ని బట్టి రుసుము వసూలు చేసే అలవాటు ఉన్న పడవ నడిపే వాళ్ళు ఈమెను ఎక్కించుకోలేదు. ఎంతోమందిని బతిమాలింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.

గట్టు మీద కూర్చున్న గోమాబాయి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ కూర్చుంది. చీకటవుతుంది. కానీ, ఎవరూ పడవలో ఎక్కించుకోలేదు. గట్టు అవతల పండరీపురం లో కాగడాలు వెలుగుతున్నాయి. ఉత్సవాలు మొదలవుతున్నాయి అన్న సూచనగా భేరీలు వినిపిస్తున్నాయి.

గోమాబాయి తనలో తాను గొణుక్కుంటుంది. అయ్యా, పండరీనాథా, నీ పండుగ చూడాలని ఎంతో కోరికతో ఇక్కడిదాకా వచ్చాను. కానీ, ఇంతలోనే నా అదృష్టాన్ని ఇలా వక్రీకరించావా... అంతమంది భక్తులను అనుమతించినవాడివి, నీకు నేనొక్కత్తినే బరువయిపోయానా? రంగా, అంతేలేవయ్యా, కమ్మలు వేసుకోవాలని చెవులైతే కుట్టించుకోగలను కానీ, కమ్ములను ఎడినుండి తేగలను? ఇదీ అంతే, నా ప్రాప్తం ఇంతేనేమో. ఇక్కడినుండి ఆ వెలుగులను చూసి తృప్తి పాడమని చెప్తున్నావా తండ్రీ అంటూ గొణుగుతుంది.

సరిగ్గా అప్పుడే ఒక ఖాళీ పడవ గోమాబాయి ఉన్న తీర్థం వైపు వచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఆ ముసలవ్వను చూసాడు. పలకరించాడు. ఏమమ్మా అవ్వా, అక్కడ అంత పెద్ద పండుగ జరుగుతుంటే, నీవు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేమిటి అని అడిగాడు. ఆ పలకరింపుకే ఆ గోమాబాయి పులకరించిపోయింది. తన కష్టాన్ని చెప్పుకుంది. అవతలి గట్టుకు చేర్చు నాయనా, నీకు పుణ్యముంటుంది, అని వేడుకుంది.

ఏ కళన ఉన్నాడో ఆ యువకుడు సరే అవ్వా, నేను చేరుస్తాలే అని అంటూ, అవ్వా, ఇక్కడంతా బురదగా ఉంది, నీవు నడవలేవు అని దగ్గరకు వచ్చి, అవ్వని అమాంతం చిన్న పిల్లని వళ్ళో ఎత్తుకున్నట్టు ఎత్తుకుని పడవ వరకూ తీసుకెళ్లి జాగ్రత్తగా పడవలో కూర్చోబెట్టి అవతలి వడ్డుకు తీసుకెళ్లాడు. పడవనడుపుతూ ఆ అవ్వ కష్టసుఖాలగురించి అడిగాడు. ఇక కష్టం ఏముంది నాయనా, సమయానికి పాండురంగాడిలా నీవు వచ్చి నన్ను అవతలకి చేరుస్తున్నావు. ఆ రంగనాథుడి రంగరంగ వైభోగం చూడబోతున్నాను, ఇక కష్టాలెక్కడుంటాయి అని అన్నది గోమాబాయి.

అవతలి తీరంలో కూడా బురద అంటకుండా ఎత్తుకుని నేలపై దిగబెట్టాడు ఆ యువకుడు. గోమాబాయి తన దగ్గర ఉన్న పిండిలో సగభాగం ఇవ్వబోయింది .. ఆ యువకుడు, వద్దు అవ్వా, పోద్దటినుండీ చాలానే సంపాదించాను. నీవు ఒక్కత్తివి ఇవ్వకపోతే నాకు తక్కువేం కాదులే. ఒక పని చేయి. ఆ సత్తుపిండిని రొట్టెలు గా చేసి ఎవరైనా భాగవతులు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు.

గోమాబాయి ఉత్సవవేడుకల్లో మునిగిపోయింది. ఆ రాత్రంతా భాగవతుల సమక్షంలో కీర్తనలు, భజనలు లాంటివాటిలో గడిచిపోయింది. ఆ మర్నాడు ఉదయం నదిలో స్నానం చేసి, గుడికెళ్లింది. స్వామిని సేవించుకుంది.

తరువాత జ్ఞాపకం వచ్చింది .. తన దగ్గరవున్న సత్తుపిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలి. పనిగట్టుకుని ఈమె వద్దకు వచ్చి రొట్టెలు అడిగి తినేవాళ్లు అక్కడ ఎవరుంటారు. ఎవరూ రాలేదు. అసలే వృద్దాప్యం. దాంట్లో ప్రయాణం, జాగరణ, అలసట అయ్యింది. గోమాబాయి నీరసంగా ఉంది. ఏ భగవతులకైనా రొట్టెలు దానం చేసి కానీ ఆమె ఏమీ తినకూడదని నియమం పెట్టుకుంది. అలా నీరసంగా ఆపసోపాలు పడుతుంది కానీ, ఒక్క బ్రాహ్మణుడూ రాలేదు.

శోష వచ్చి పడిపోయేలా తయారయ్యింది ఆమెకు. ఆ క్షణంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. చూస్తే భాగవతుడిలా ఉన్నాడు. అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం కడుపులో పడితే కానీ, కాలు కూడా కదిపే పరిస్థితి లేదు అని అడిగాడు గోమాబాయిని.

తన దగ్గర ఉన్న పిండితో రెండు రొట్టెలు చేసి ఉంచింది. దాంట్లో ఒకదాన్ని తీసి ఇచ్చి ఆ వృద్దుడికి ఇచ్చింది. ఆ వృద్ధుడు ఆ రొట్టె తిని, దీవించాడు. కానీ, తన వెంట ఉన్న వృద్ధిరాలికి కూడా ఏదైనా పెట్టమ్మా అని అన్నాడు. తనగురించి ఉంచుకున్న రొట్టెను ఆ బ్రాహ్మణుడి వెంట ఉన్న స్త్రీకి ఇచ్చాడు. ఆమె నోట్లో ఆ రొట్టెను పెట్టుకుందో లేదో, ఆ వృద్ధ దంపతులు పాండురంగడు, రుక్మిణీ మాతగా దర్శనం ఇచ్చారు.

గోమాబాయి సంతోషానికి హద్దులు లేవు. సంతోషంతో వణికిపోతూ గోమాబాయి కళ్ళలో నీళ్లు ధారగా కారుతుండగా రుక్మిణీ రంగనాథుల పాదాలపై ప్రార్థిస్తూ పడిపోయింది. ఆ పుణ్యదంపతులు గోమాబాయి ని లేవనెత్తి , గోమాబాయి, దరిద్రానికి చింతించకు. మేము నిన్ను ఎప్పుడో మా ఆంతరంగిక భక్తుల్లో ఒకరిగా స్వీకరించాము. అందుకే, రాత్రి పడవవానిగా, ఇవ్వాళ విప్రదంపతులుగా, ఇప్పుడు యదార్థరూపాల్లో దర్శనమిచ్చాము. దుఃఖాన్ని మాని, మమల్ని ఎప్పటిలాగే సేవించుకో. నీకు త్వరలోనే నా సన్నిధిలో స్థానం ఇస్తాను అని చెప్పి వెళ్లిపోయారు రుక్మిణీ పాండురంగలు.

జీవితాంతం ఆమె రంగనాథ భక్తురాలిగా ఉంటూ అంత్యకాలంలో కృష్ణునిలో ఐక్యమయిపోయింది.

Whom to worship? ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన, అంత మాత్రమె నీవు M Planet Leaf


ఒకటే వస్తువును రెండు రకాలుగా గణితంలో చూపించవచ్చును. దాన్ని time domain లోనూ, అలాగే frequency domain లోనూ.

ఒక domain నుండి మరొక దానిలోకి మార్చితే, దాని స్వరూపం మారుతుంది. అంతే తప్ప, వస్తువు మారదు. ఉదాహరణకు 1 సమయపరంగా చూస్తె 1/s అని frequency పరంగా కనబడుతుంది.. కానీ రెండూ ఒకటే. అంతవరకు ఎందుకు? ఒక పిరమిడ్ ను ఒక వైపు నుండి చూసునప్పుడు త్రికోణంగాను, కిందనుండి చూస్తె చతురశ్రంగాను , ఎంతో ఎత్తు నుండి చూసినప్పుడు ఒక బిందువుగాను కనబడుతుంది. అది చూసే వారి దృష్టిని బట్టి ఎన్నో రకాలుగా కనిపించవచ్చు కానీ అక్కడున్న వస్తువు ఒకటే. 

మనకు మన వాంగ్మయం చెబుతున్న “శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః” తత్త్వం ఇదే.

ఆ వున్న ఒకటే శక్తిని మనం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగాను, స్థితి కాకరకత్వాన్ని విష్ణు తత్త్వంలోను, లయం చేసినప్పుడు రుద్రుని గాను పిలుస్తున్నాం, పూజిస్తున్నాం.శక్తికి సాధారణంగా స్త్రీ వాచకంగా వాడడం కద్దు. ఆ శక్తిని మనం మహా మాయగాను, త్రిపురసున్దరిగా, లలితా పరమేశ్వరిగా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా కొలుస్తాము. ఆ శక్తికి, శక్తి కారకత్వానికి అభేదం. ఆమే పరమపురుషుడు, పరమాత్మ అన్నీను. మనలను కరుణించదానికి వివిధ రూపాలలో కనబడుతున్న ఏ పరమ పావన శక్తి వుందో అది ఒక్కటే. అదే అన్నింటికీ మూల కారణం. శక్తి వున్నది ఒక్కటే. అదే వివిధ రూపాలలో రూపాంతరం చెందుతున్నది. శక్తిని ఒకరు పుట్టించలేరు, హరించలేరు. అది రూపాంతరం చెందుతుంది. ఈరోజు మనం చూస్తున్న స్థావర జన్గాత్మకమైన ప్రపంచం ఆ పరమ శక్తి యొక్క రూపం మాత్రమె. 

ఇతః పూర్వం ఒకసారి మనవి చేసివున్నాను. ఒక తీగలో విద్యుత్తు శక్తి ప్రవహిస్తుంది. దాన్ని వ్యక్తీకరించడానికి నేను ఒక బుల్బ్ పెడితే కాంతి రూపంలో ప్రకటితమవుతోంది, ఫ్యాన్ పెడితే వాయురూపంలో, ఏ ఉపకరణం పెడితే ఆ ఉపకరణవిశేషంగా అదే శక్తి ప్రకటితమవుతోంది. కానీ వున్న శక్తి ఒకటే. ఆ శక్తి ఉత్పన్నానికి కారణం అణు విద్యుత్తు అవ్వచ్చు, థర్మల్ అవ్వచ్చు, లేక జలశక్తి వలన అవ్వచ్చు. ఒక రకం శక్తిని మనం మరొక రకం శక్తిగా మార్చుకుని వాడుకుంటూ ఉన్నాము. కానీ మనం శక్తిని సృష్టించలేము. శక్తిని కనుగొనగల0. ఈ అనంత సృష్టి ఆ శక్తి స్వరూపమే. ఆ శక్తి మనలను వివిధ రూపాలలో ఆశీర్వదిస్తోంది. ఆ శక్తిని మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది. నారాయణ అనవచ్చు, శివా అనవచ్చు, గణేశా అనవచ్చు లేక దేవి అనవచ్చు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం ఒకటే.

ఆ వేంకటేశుని అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహం శంఖ చక్ర అభయ వరద హస్తాలతో మనను ఆశీర్వదిస్తూ వుంటారు. స్వామి మన మీద దయతో నిరతం అందరికీ దర్శనం అనుగ్రహిస్తూ మన పాపాలను నాశనం చేస్తూ మనకున్న కష్టాలను దూరం చేస్తూ అనంత ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను, మోక్షగాములకు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతిని కలిగిస్తూ ఆనందనిలయంలో కనబడతారు. వారి దక్షిణ వామ హస్తాలలో శంఖ చక్రాలు,ఆయన స్వరూపం త్రిమూర్త్మ్యాతకం.

“విష్టోర్ముఖో ద్ధానిలపూరితస్య, యస్య ధ్వనిర్ధానవదర్పహంతా,
తం పాంచజన్యం శశికోటిశుభ్రం, శంఖం సదాహం శరణం ప్రపద్యే”

శంఖం – ఓంకారానికి ప్రతీక. “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ”. పంచాయుధాలలో ప్రముఖమైన శంఖం బ్రహ్మకు ప్రతీక. శంఖం అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. ఓంకార శబ్దాన్ని టైం డొమైన్ transform చేస్తే, శంఖం రూపంలో వుంటుంది.

“స్ఫురత్సహస్రార శిఖాతితీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరఱం ప్రపద్యే”

చక్రం – కాలానికి లయానికి ప్రతీక. శివుని లయకారుడని అనడం కద్దు. ఆయనే సుదర్శనుడని ప్రగాఢ నమ్మకం. ఆయన పరబ్రహ్మ స్వరూపమైన సాక్షాత్తు విష్ణుడని ఎందరో మహానుభావుల అనుభవం.

వేంకటేశుడు సాక్షాత్తు త్రిమూర్త్మ్యాత్మక స్వరూపుడు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు అన్నట్టు.  అలాగ ఆయన రూపం అదే సత్యాన్ని తెలియ చేస్తున్నట్టు శంఖు చక్రాలతో త్రిమూర్తి స్వరూపాన్ని చూపెడుతోంది.

అలాగే శివుని రూపం రుద్రకవచ ధ్యానంలో :

“శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం వంచవక్ర్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం నాగం పాశం చ ఘంటాం 
ప్రళయ హుతవం సాన్కుశం వామభాగే నానాలంకార యుక్తం స్పటిక మణినిభం పార్వతీశం నమామి “

ఆయన ధరించిన ఆయుధాలు కూడా మరి ఇద్దరిని గుర్తు చేసినట్టు వుంటాయి. త్రిశూలం తిరునామానికి, మేషం 12 రాశులలో స్థితి తత్వానికి, అనగా, విష్ణువుని సంకేతిన్చాగా, డమరుకం ప్రణవ నాదానికి, కమండలం బ్రహ్మకు, మొదట వినిపించిన “తపః తపః” అనే తపస్సుకు సంకేతార్ధంగా వుంటుంది.

బ్రహ్మ చేతిలో వేదాలు, ఏ వేదాలు తెలియచేస్తున్న వేదపురుషుడైన విష్ణువో అతడిని సంకేతంగా కమలం ద్వారా కూడా ఆయననే చూపుతూ, కమండలం రూపంలో నిరంతరం ధ్యాన మగ్నుడై, జ్ఞాన స్వరూపమైన శివ తత్వాన్ని తెలియచేస్తున్నాయి.

వారి రూపాలలో కొంత వ్యత్యాసమున్నా వారు మువ్వురూ చూపుతూ వున్నది అభేద తత్వమే. ఈ మూడు తత్వాలను ఒక త్రికోణంలో మూడు ప్రధానబిందువులు అనుకుంటే, వాటి centroid ఆ శక్తి స్వరూపం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అది నారాయణుడు, పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ, మహామాయ, మహాశక్తి. కావున మనం, మనకు ఏది నచ్చిన తత్వమో, ఆ పేరుతో పూజిద్దాం. వున్నది ఒకటే తత్వమైనప్పుడు, ఏ రూపంతో కొలిచినా జరిగే అనుకూలత ఒకటే. మరొక తత్వాన్ని విమర్శించకుండా, మనకు నచ్చిన రూపాన్ని ఉపాసించి, ఆ పరమాత్మ కరుణను పొందుదాం.

అన్నమయ్య కీర్తనలో ఇలాచెబుతాడు. 'హరి ఇతన్డు, హరుడతండు ఆకారమొక్కటే, హరిహరు లందును అధికులెవ్వరులేరు' ఆ హరిహరరూపమే ఈ వేంకటాద్రిపై వెలసిన వేంకటేశుడు. 

మరొక కీర్తనలో.. 

“తలతురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు... 
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, 
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమని, 
తలతురు మిము శైవులు తగిన భక్తులు శివుడనుచు, 
అలిరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడునుచు” 

అని ఆ వేంకటేశుని తత్వాన్ని విశదీకరించాడు. 

“ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు “
కరుణించు కాపాడుము ఓ వెంకటేశ్వరా.!!!

సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు...

24 March, 2019

Dasa Mahavidyas in Telugu - దేవీ శక్తులు - దశ మహావిద్యలు

దేవీ శక్తులు - దశ మహావిద్యలు
                                                                                         
నేలనతికి బతుకుతున్న, నింగినంత వెతుకుతున్న
నేనెవ్వరు? నేనెవ్వరు?
కాగితాల కూరుకున్న, ఊపిరితో ఊగుతున్న
నేనెవ్వరు? నేనెవ్వరు?
నిద్రనించి తేరుకుని, నిద్రలోకి జారుకునే
నేనెవ్వరు? నేనెవ్వరు?

అని ఎన్నోసార్లు అనిపిస్తుంది . అనుదిన చైతన్య ప్రవాహం వెనుక కాల వ్యోమాతీతమైన విధిని నియంత్రించే శక్తి ఏదో అనిపిస్తుంది. దేన్ని ఆరాధిస్తే అన్నిటిని ఆరాధించినట్టవుతుందో అదే పరబ్రహ్మ శక్తి, దాన్నే అందరు సర్వగత చైతన్యము అన్నారు. జన్మనివ్వడం, సృష్టించడం అనేవి స్త్రీత్వం యొక్క అద్భుత తత్వం కనుక ఆ మూల శక్తి ని 'అమ్మ ' గా సేవించారు. గుణాతీత తత్వాన్ని అమ్మ అన్నా, నాన్న అన్నా లేక మరో పేరుతో పిలిచినా ఒకటే కదా! ఆ సర్వశక్తిని అనేకులు అనేక విధాలుగా ప్రార్ధించారు.

లోకంబులు, లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెలుగు నతని నే పూజింతున్
(భాగవతము)

యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తయై నమో నమః
(దుర్గా సప్త శతి)

ఎక్కడైనా ఒక చోట ఉండేదాన్ని పట్టుకుంటాం - చేపపిల్లల్ని పట్టినట్టు పట్టి ఎక్వేరియంలో పెంచుకుంటాం. మరి మహా సముద్రంలో దూకి తిమింగలాన్ని పట్టుకుంటామా, పెంచగలమా? అందుకే అందరిలో ఉండే పరబ్రహ్మ శక్తిని ఆకళింపు చేసుకోవడం నిజంగా సులభం కాదు. అన్నిటిని వ్యాపించిన ఆ శక్తి అణుశక్తి లాంటిది. అతి  చిన్నది, అత్యంత తీవ్రమైనది అయినా అతీతమైనది. సరే మన పరిధిలో దీన్ని గణించడానికి ఒకటే కొలమానం పనిచేయకపోవచ్చు. సరే వ్యోమం అంటే దిక్కులని ఆధారంగా తీసుకుంటే పది దిక్కులని పదిశక్తులుగా విభజిస్తే ఆ పదిశక్తులని 'దశ మహా విద్యలు ' అని చెప్పొచ్చు. మంత్ర శాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని మంత్రాలని, దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ పది దేవీ శక్తులని దశావతారాలతో పోల్చారు కొందరు. కానీ ఇవి దశావతారాలు కావు. The ten great cosmic powers.ఇవి బ్రహ్మ విద్యలుగా గుర్తించి, దేవతా శక్తులుగా పూజించి అనుగ్రహాన్ని పొందారు, శక్తివంతులయ్యారు కొందరు.  వాళ్ళని వీళ్ళని ఏదో చేయాలనే మూర్ఖత్వంతో తన అంతః శత్రువులని జయించక తమ కాలాన్ని, తపః శక్తిని వృధా చేసుకున్నారు కొందరు. విధిని, జీవన గతిని నిర్ధారించే, అన్నిటిని ధరించే ఆ శక్తి మాత్రమే శరణాగతికి అర్హమైనది - ఏ పేరుతో మనం పిలిచినా......

వాటి మంత్ర శక్తి తీవ్రతని బట్టి, వాటి అపరిమిత శక్తిని బట్టి దశ మహా విద్యలుగా పిలవబడే ఈ శక్తులు సిద్ధులచే చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. బౌద్ధంలో కూడా ఇవి సుప్రసిద్ధములు. ఈ ఆధునిక యుగంలో వీటిని పూర్వం కన్నా ఎక్కువ మంది ప్రచారం చేయడం, భారత దేశంలోనే కాక ప్రపంచమంతటా సాధన చేయడం జరుగుతోంది . లభించే ఈ జ్ఞానాన్ని మనం కొంత జాగ్రత్తగా గ్రహించడం అవసరం. తత్వం అర్ధం కాకుండా కేవలం మంత్ర జపం వల్ల వీటి అనుగ్రహం కలగక పోవచ్చు. వీటి చిత్రాలు ఇంకా విచిత్రాలుగా ఉంటాయి. చిత్రకారులు తమకి తెలిసిన అర్ధంలో బొమ్మలు గీయడం , భక్తులు వాటిని తొందర తొందరగా పెట్టేసుకోవడం జరుగుతోంది. వీటిని మామూలు చిత్రాలు గా గీయడం సరికాదు. ఈ దశ మహావిద్యలని 'ఎబ్ స్త్రాక్ట్ ' గా నిజమైన దివ్య మనో 'చిత్రాలు ' గా దర్శించడం మంచిది. అందుకే దేవతా యంత్రాలు 'జ్యామెట్రిక్ రిప్రజెంటేషన్ 'గా ఈ దేవతలని అర్ధం చేసుకుందుకు ఉపయోగపడతాయి.


ఇంతకీ దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంథాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నామ్స ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి .

కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధారణంగా వీటిని ఉపాసించే వారు వీటి విస్తృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా (అంటే లేకపోతే కాదని కాదు సుమా) ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే ఇంకో ఉదాహరణ హిమాలయాల్లో ఉండే యోగులని చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత ' తాలూకు నిర్వచనం ఏమిటి. వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి, అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు?  ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్ధం కాదు.

వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికి అర్ధం కావేమోనని భజనలు, ప్రార్ధనలు. అవీ రావేమో నని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?

దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)

ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ అనాత్మయే! అంటే ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేకవేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక, ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం తమలో ఆ మంత్రాన్ని దాన్న తత్వాన్ని విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.

ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధీయోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః

దశమహా విద్యల్లో మొదటిది కాళి. కాలమనే మాటలోంచి పుట్టినది కాళి. ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో, పురాణములలో ఎన్నో కధలున్నాయి. రామకృష్ణ పరమహంస ను అనుగ్రహించినది, వివేకానందుడిని భరత భూమికి ప్రసాదించిన శక్తి ఈమే. సృష్టి ఆరంభంలో మహా విష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉదయించాడుట. విష్ణువు నిద్రావశుడై ఉండగా ఆయన చెవిలోంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు బ్రహ్మను బాధించడం మొదలుపెట్టారు. వారినేమీ చేయలేక విష్ణువును లేపడానికి ప్రయత్నించి విఫలుడై మహామాయను, కాల స్వరూపిణి అయిన కాళిని స్తుతించగా ఆమె అవతరించి విష్ణువుని లేపింది రాక్షసులని సమ్హరించడానికి శక్తి నిచ్చింది. ఇంకొక కధలో మహా ప్రళయ కాలాన సమ్హార శక్తియైన కాళి మహా తాండవం చేస్తున్నది. ఆమె పాద ఘాతములకు లోకములు తల్లడిల్లి పోతున్నాయి. పరమశివుడు లోకరక్షణార్ధమై ముందుకు వచ్చి, "దేవీ! నీ పాదఘట్టనకి సమస్త బ్రహ్మాండములు కదలి పోతున్నాయి. అవి ఇంక తట్టుకోజాలవు. ఇక నా దేహం పైనే కాలు మోపు" అన్నాడుట శివుడు. ఆ మాటనంగీకరించి ఆమె శివుడిపై నిలుచుంది. ఈమెను భారత దేశంలోనూ, ప్రపంచమంతటా నేడు ఉపాసిస్తున్నారు. కాళీ సాధన ఒక ప్రత్యేక సాధన. అందరికి అర్ధమయ్యేదీ అతిసులువైనదీ కాదని యోగులు తెలియజేస్తున్నారు. ప్రకృతి సహజ స్వరూపిణియైన ఈమె అనుగ్రహంతో అనేక దేవతా తత్వాలను తెలుసుకోవచ్చును. ఈ మార్గంలో ప్రవేశించే వారు తప్పకుండా నిస్వార్ధపరులైన గురువులను అడిగి ఈ తత్వాన్ని అధ్యాత్మిక రూపంగా అవగాహన చేసుకున్నాకే మొదలుపెట్టడం అవసరం.

కలకత్తాలో దక్షిణ కాళి ఆలయం

"ఇంత శక్తి వంతమైన దేవతను మీరెందుకు పూజిస్తున్నారు ? మీకు కాళిని పూజిస్తే ఏమి కలుగుతుంది? " అని ఒకాయన ఒక యోగిని అడిగారుట. ఇది కలకత్తాలో దక్షిణ కాళి ఆలయంలో జరిగింది. అందుకాయన చెప్పారుట, "మానవులలో విజయం సాధించాడినికున్న మొదటి విఘ్నం వాళ్ళ భయం. చేసే ప్రతి పనిని, విషయాన్ని బూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి బానిసలై అనుక్షణం ఛస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరంచేసే నిర్భయ శక్తి ఆ కాళి. ఆమె రూపం అందుకే అలా ఉంటుంది. అంతటి రూపాన్ని రోజూ పూజిస్తూ, నిరంతరం దర్శించే సాధకుడికి ఇంకేమి భయం కలుగుతుంది? దేన్ని చూసినా అంతకన్న తక్కువే! అందుకని సాధకుడిలో జీవితాన్ని ఎదుర్కునే విజయాన్ని సాధించే శక్తి కలుగుతుంది. దుర్గా సప్త శతిలో కూడా చండికా దేవి శక్తి మూడు రూపాలుగా రాక్షస సమ్హారం చేస్తుంది - కాళి, లక్ష్మి, సరస్వతి అంటున్నాము. కాళికా దేవి ఇఛ్చా శక్తి స్వరూపిణి. అంటే విల్ పవర్ పెంచుతుంది. లక్ష్మీ దేవి క్రియా శక్తి స్వరూపిణి. అంటే వర్క్ ఫోర్స్. సరస్వతి దేవి జ్ఞాన శక్తి స్వరూపిణి. అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. బెంగాలులో శ్రీ రామప్రసాద్ అనే మహా భక్తులు ఉండేవారు. ఆయన గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. కాళికా దేవి వీరింట్లో చిన్న బాలికగా తిరుగుతుండేదిట. ఆయన నులక మంచం అల్లుతుంటే రెండో వైపు ఆయన కూతురులాగా కూర్చొని తానూ నులక ఆయనకి అందిస్తుండేదిట. ఇది చూసినవారెంత అదృష్టవంతులో! ఏ తల్లి సృష్టి తంత్రులను కాలంతో మెలిపెట్టి అల్లుతోందో - ఆమె నులక మంచం అల్లడం.. " అని నవ్వారాయన.

"మీరు కాళీ సాధన ఎలా చేసారు? ఎలా మొదలు పెట్టారు? " అని అడిగారు ఆ సాధకులు. దానికా యోగి ఇలా సమాధానమిచ్చారు.

"ప్రపంచం లో ఆనందానికి మూలం - ప్రేమ. అదిలోపించినపుడు కలిగేది బాధ. మనుషుల కర్మలు, సాధన, సంపాదన అన్నీ ప్రేమ కోసమే కదా! ఎవరికి వారు వారు ప్రేమించిన వాళ్ళకోసం సంపాదించి, ఆహార వసతులు ఆనందాలు ఏర్పాటుచేస్తారు. అందుకు ఒక్కోసారు ఇంకోళ్ళను బాధపెడుతుంటారు. ఈ మహా చక్రం చిత్రమైనది. సరే నా విషయానికి వస్తే నాకు చాలా ఏళ్ళ కిందట ఎన్నో సమస్యలుండేవి. రోజూ ఆ బాధలు పడలేక పోయేవాడిని. ఎవరు లేనప్పుడు కన్నీళ్ళు కూడా వస్తుండేవి. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు నాకు ఒక గురువు పరిచయమయ్యారు. ఆయన కాళీ మంత్రం ఉపదేశించారు. ఏమండి మరి కాళి ని ఉపాసించాలంటే ఏం చెయ్యాలి ఎక్కడకి వెళ్ళాలి? అని అడిగాను. అందుకాయన చెప్పారు ఎక్కడో ఒక చోటే కూచుని ఉంటే ఆమె సర్వశక్తియైన కాళి ఎలా అవుతుంది? నువ్వెక్కడుంటే కాళి అక్కడే ఉంటుంది. నీతోనే ఉంది అని గుర్తించడం ఉపాసన. 'ఉపాసన ' అంటే 'ఉప ' (దగ్గరగా) , 'ఆసన ' (కూచోడం, ఉండడం). ఆ దేవత దగ్గరఏ ఉండడం ఆమె ఉపాసన అన్నమాట. కాళి అనే ఆ మహా ఇఛ్చాశక్తి మనతోనే ఉండడం 'ఉపాసన ', మనలోనే ఉండడం 'సిద్ధి '. మనం ఆమె స్థితి (మండలం) కి చేరడం 'సాక్షాత్కారం '. ఇది అర్ధమైన నేను కాళీ సాధన మొదలు పెట్టాను. నాలో అనవసరమైన విచారం, అ

"స్వామీ ! ఏమిటి మిమ్మల్ని భూతం పట్టిందా ? అది వదిలి పోయిందా ...అది ఏం భూతం ? నిజంగా దెయ్యాలూ, భూతాలు పడతాయా?! " అని ఆశ్చర్యం గా అడిగాడు ఆ సాధకుడు.

దానికా యోగి పక పకా నవ్వి, ఆత్మీయంగా చూసి చెప్పారు, "భూతం అంటే మరేమీ కాదు, భూతమైనది - భూత కాలానికి చెందింది. అంటే గతం అన్నమాట. మనం చాలా సార్లు భూతకాలంలో జరిగిందాన్ని ఒకటే తల్చుకుని బాధపడుతుంటాం. ఒక పట్టాన ఒదలలేక విచారిస్తూ ఆ తలంలో బుర్ర ఉండి పోయి అమూల్యమైన ప్రస్తుతాన్ని, అతి విలువైన భవిష్యత్ ని పాడు చేసుకుంటాం. అదే 'భూతం ' పట్టడం అన్నమాట. అందరికి ఇది ఎప్పుడో అప్పుడు తారసపడుతుంది. దాన్ని నేను కూడా కాళీ శక్తితో (భూతాన్ని ఖాళీ చేయించి) జయించి, జీవితరంగంలో పోరాడి అంతరంగాన్ని, ప్రపంచాన్ని గెలిచాను. డబ్బు, పేరు అన్నీ తీవ్రం గా సంపాదించాను. నేను ఆనందంగా ఉండడం మొదలు పెట్టాక అన్నీ వస్తున్నాయని గ్రహించాను."

"స్వామీ! చూస్తుంటే ఇది మీ మనోశక్తికి సంబంధిన విజయంలా ఉంది. ఇందులో ఉపాసన, మంత్ర బలం పని చేసాయంటారా? " అని అడిగాడు సాధకుడు.

"ఖచ్చితం గా గ్రహించావు. నీలో శక్తిని ముందు నువ్వు నిద్ర లేపు. భయంలేకుండా సంకల్ప బలం తో నువ్వు చాలా చెయ్యగలవు. ఆపైన కావాల్సిన అవకాశాలని, అదృష్టాన్ని అమ్మ ఇస్తుంది. అన్నీ వచ్చాక నాకూ అనుమానం వచ్చింది. ఇదంతా నా ప్రతిభేనేమోనని. అసలు అమ్మవారు ఎక్కడ ఉంది అని. హిమాలయాలనించి కేరళ దాకా గురువులను చూసాను. వారితో సన్నిహితంగా తిరిగాను.కోట్లలో జపాలు, హోమాలు చేసాను. అపుడు అర్ధమైంది విషయం ఏమిటో..ఆ మూల పరబ్రహ్మత్వం తత్వమేమిటో..." అన్నారు ఆ యోగి.

"స్వామీ! మీరు కొంచెం ఒక చిన్న విషయం చెప్పాలి. స్వశక్తితో మీరు చాలా కష్టపడి ఏవో సాధించారు బాగుంది. ఉపాసన చేసారు బాగుంది. మరి ఇదంతా చేసింది ఆ తల్లి కదా, అది నిర్ధారణ చేసుకున్నారా, ఆమెను గురించి తెలుసుకున్నారా?" అని అడిగాడు సాధకుడు.

ఆ యోగి చిరునవ్వు నవ్వి, "ఇంకా తెలుసుకుంటున్నాను. ఎన్నో తెలుసనుకుంటున్న వారు కూడా ఇంక తెలుసుకుంటున్నారని తెలుసుకున్నాను" అని కళ్ళు మూసుకుని దేవిని ప్రార్ధించారు దేవి సప్త శ్లోకితో ఇలా..

దేవీత్వం భక్తి సులభే సర్వకార్య విధాయని
కలౌహి కార్య సిధ్ధ్యర్ధముపాయం బ్రూహి యత్నతఃఅ ...

అంతలో గాలిలోంచి ఒక తులసి మాల వచ్చి ఆ యోగి వళ్ళో పడింది. యోగి కళ్ళు తెరిచి చూసారు. నవ్వి, అలా చిత్రంగా గాలిలోంచి పడ్డ ఆ మాలని "కాళీ ప్రసాదం , సాధన చేసుకో !" అని ఆ సాధకుడికి ఇచ్చి లేచి వెళ్ళిపోయారు. సాధకుడు చాలా సేపటి దాకా తేరుకో లేదు. ఆ మాల ఎక్కడిది అని ఇప్పటికి అలోచిస్తూనే ఉన్నాడు. ఆ చుట్టు పక్కల జన సందోహంలో ఎవరైనా విసిరేసారేమో అని 'లాజికల్' గా కూడా అలోచించాడు. ఆ కాళి కే తెలియాలి ఏది ఎక్కడినుండి వస్తుందో మళ్ళీ ఎక్కడికి వెడుతుందో!

శ్రీః

Birth of Navagrahas in Telugu - నవ గ్రహముల జననము

నవ గ్రహముల జననము

1) సూర్యుడు : శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని  "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను.

(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)

కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని, అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని, అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను.

సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను. సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను. తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను.

యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను.
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు.

2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం. అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను.

(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)

సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను. చంద్రుని పుత్రుడు బుధుడు.

3) కుజుడు : శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి, గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను.

(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)

రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను

4) బుధుడు : సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను.
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)

బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను.

5) బృహస్పతి : సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను.

(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)

ఇతని భార్య "తారాదేవి". ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని "గురుడు" అనెదరు.

6) శుక్రుడు : భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం "ఉశనుడు" జన్మించెను.

(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)

కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను. పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరు. అత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను. గ్రహమండలమున స్థానంపొందెను.

7) శని : సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను.

(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)

ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు. త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు. గ్రహమండలమున స్థానం పొందెను.

8) రాహువు : కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను. ఇతడు రాక్షసుల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు.

(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)

క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను  అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది

9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి. ఇతని భార్య పేరు చిత్రలేఖ.

రాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...

నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును. నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును (అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను.