Ads

Showing posts with label History in Telugu. Show all posts
Showing posts with label History in Telugu. Show all posts

17 November, 2020

నాగుల చవితి పూజతో ఐశ్వర్య సిద్ధి!

కార్తీక మాసం శుక్లపక్ష చవితిని నాగులచవితిగా జరుపుకుంటారు. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు,వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. వారికి ఇష్టమైన ఈ రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలలో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో, రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా, మొదలైన దొషాలు తొలగిపోతాయి.

నాగులకు ఇష్టమైన రోజున వారిని పూజించి అనుగ్రహం పొందాలి. వాసుకి విష్ణువుని ప్రార్ధించి పరోపకారం చేసే పనిని తనకు అప్పగించమన్నాడు. దీంతో, భూభారాన్ని మోయడమే గొప్ప పరోపకారమని చెప్పి, అందుకు అవసరమైన శక్తి సామర్ధ్యాలను వాసుకికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. అందువల్ల, అందరికంటే గొప్ప పరోపకారి మన భూభారం మోస్తున్న వాసుకి.

ఆదిశేషువు.. విష్ణువుకు పానుపుగా మారాడు. అందువల్లే విష్ణువు శేషశాయి అయ్యాడు. ఇంకొకరు శివుని అనుగ్రహం పొంది అయన మెడలో ఆభరణంగా మారింది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టెశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకని నాగుల చవితి రోజున ‘నాగేంద్రా! మేము మా వంశంలో వారం నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలిగిపో. నడుం తొక్కితో నా వాడనుకో.. పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి’ అంటూ ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పెద్దలు చెబుతారు.

నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే, సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్ర నామ పూజలు చేయించడం, శుభదాయకం. ఇక, నాగుల చవితినాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే, సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు.

అందులోని కుండలినీ శక్తి, మూలాధార చక్రంలో పాము ఆకారంలా ఉంటుందని, ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. కాబట్టి, నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పాములను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలని కోరుకుంటారు. ఇదే నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెబుతారు.

నమస్తే దేవదేవేశ

నమస్తే ధరణీధర

నమస్తే సర్వ నాగేంద్ర

ఆదిశేష నమోస్తుతే

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా. దానికి నిదర్శనమే ఈ నాగుల చవితి. ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈ రోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.

నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లు, ఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు. నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు. ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.

నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి.

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు, ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత కూడా చెప్పించాలి..

'నడుము తొక్కితే నా వాడు అనుకో.. పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో.. తోక తొక్కితే తోటి వాడు అనుకో.. నా కంట నువ్వుపడకు.. నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.. అని చెప్పాలి.

ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి, మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి, అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటె, వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్ట పెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట. ఇలాంటివి నేర్పడంలో ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత, బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు. ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారాన్ని పెట్టటం అన్నమాట. ఉదాహరణకు, చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకుని ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. ఈ రోజు సాధారణంగా, ఇంట్లో ఆడవాళ్లు ఉపవాసం వుంటారు.

ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ, భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికీ 'నీటిని' ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా 'రైతు'కు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు, నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే, సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.

Link: https://www.youtube.com/post/UgwXuVUCE1jxfqVNQuR4AaABCQ