Ads

23 December, 2021

భగవద్గీత - Bhagavadgita

 

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా ।
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా ।।

శ్లోకం అర్ధం:
భగవద్గీతను కొంచమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు (దీనర్థము చావు అంటే భయం పోతుందని).

[ భగవద్గీత వీడియోలు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b ]

భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై, మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ, భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం, మనిషిలో అజ్ఞానం దూరం చేసి, స్థిత ప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మల జలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు, జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం, మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?

అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ, అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై, మృత్యు భయం వీడి తరిస్తుంది.

No comments: