Ads

Showing posts with label Mythological Videos. Show all posts
Showing posts with label Mythological Videos. Show all posts

23 March, 2019

మార్చ్ 24, 2019 సంకష్టహర చతుర్థి - Sankashtahara Chathurdhi

రేపు అనగా 24 మార్చి, 2019న సంకష్టహర చతుర్థి


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ )

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

ఓం గం గణపతయే నమః

సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

అంగారక చతుర్థి

సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితిమంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలోకుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.

ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

వినాయక వ్రతం

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. “సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు”. పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 ‘చవితి ‘లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం

భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ఈ ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు.

పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...

ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.

దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.

''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు.

''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.
''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు.

వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది.
దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు.

ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు.

''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు.

అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.

''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు.
అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది.

అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?

గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి

1. వరద గణపతి పూజ
2. సంకష్టహర గణపతి పూజ.

వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు. అదే వచ్చే నెల రెండో తారీఖున రాబోతున్న అద్భుత ముహూర్తం.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

సంక్షిప్త వ్రత విధానం :

1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.
4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.
9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.
14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.
15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.
16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.

నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,

1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి
2. ఏ పూలు వాడాలి?
జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.
వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.

3. ఏ మంత్రం జపించాలి?
జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,
'గజానన' అనే నామ మంత్రంగానీ,

'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' 

అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.

4. నైవేద్యం ఏమి సమర్పించాలి?
కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు

5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?
జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.

6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?
జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.

7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?
జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.

8. పూజ చేయడం చేతకాదనుకుంటే?
జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.

వ్రతాచరణ వలన లాభాలు :

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం.

పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.

సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

ఏకవింశతి నామ పూజ :

ఓం సుముఖాయ నమః మాలతీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః జంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గణ్డకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి

వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము...

22 March, 2019

దంపతులు - ఆది దంపతులు


దంపతులు - ఆది దంపతులు

శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ, పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది...

ఇదేం విడ్డూరం అమ్మాయ్!

పార్వతి దేవి ఎండకన్నెరుగని పిల్ల,

పరమేశ్వరుడేమో ఎండలో ఎండిపోతూ, వానలో తడిసిపోతూ, శ్మశానాల్లో బతికే రకం!

ఆమె తనువంతా సుగంధ లేపనాలు,

అతడి శరీరమంతా బూడిద గీతలు.

ఆమె చేతులకు వంకీలు,

అతడి చేతులకు పాము పిల్లలు.

ఎక్కడా పొంతనే లేదు. చూస్తూ ఉండు. నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది...

నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి...

కానీ వారు...

ఆదిప్రేమికులు, ఆదిదంపతులుగా వర్ధిల్లుతూనే ఉన్నారు. 

"బయటికి కనిపించే రూపాన్ని కాదు...

శివుని అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి దేవి"

అతడు విష్ణువు అయితే, ఆమె లక్ష్మీ దేవీ...

అతడు సూర్యడైతే, ఆమె నీడ...

అతడు పదం అయితే, ఆమె అర్థం...

అలా అని ఆ దంపతుల మధ్య విభేదాలు రాలేదా?

అంటే, వచ్చాయి...

ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా?

అంటే, తలెత్తాయి...   

ప్రతి సమస్య తర్వాత, ఆ బంధం మరింత బలపడింది...

ప్రతి సంక్షోభం ముగిశాక, ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు...

ఏ ఆలుమగలైనా, పట్టువిడుపుల పాఠాల్ని శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి!

ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే, మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంది!

మధురలో అమ్మవారిదే పెత్తనం! సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మ కు మొగుడే. 

నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి...
               
అదే చిదంబరంలో, నటరాజస్వామి మాటే శాసనం... శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు...
 
ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి! ఇలా ఎన్నోచోట్ల భార్య పెత్తనం...

అలానే భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల...

అందుకే.., జగత్తునేలే ఆదిదంపతులయినారు పార్వతీపరమేశ్వరులు...🙏

అందుకే ఏ జంటను దీవించాలన్నా ..,

పార్వతి పరమేశ్వరులలాగా కలకాలం ఉండండి అని దీవిస్తారు...

🙏 శంభో శంకర 🙏

21 March, 2019

Must Know Science Behind the Cosmic Dance of Lord Shiva!

 



తప్పక తెలుసుకోవలసిన రుద్ర తాండవ ఆంతర్యం! MPL
  Must Know Science Behind the Cosmic Dance of Lord Shiva!
శివుడు తాండవంచేసే స్థలాన్ని రత్నసభ అంటారు. ఆ రత్నసభకి శివుడే అధిపతి కాబట్టి, ఆయనను రత్నసభాపతి అంటారు. ఈ నిత్య శివతాండవానికి, బ్రహ్మ తాళములు, సరస్వతి వీణా, విష్ణువు మృదంగమూ, సూర్యచంద్రులు వేణువులూ, నారద తుంబరులు గానం, ఇతర ప్రమాధగణాలు భేరీ మృదంగ తాహళకళాదులచే, వాద్యసహకారం అందిస్తారు.

శివతాండవ లక్షణాలు ఏడు... 
1. ఆనంద తాండవం
2. సంధ్యా తాండవం
3. ఉమా తాండవం
4. గౌరీ తాండవం
5. కాళికా తాండవం
6. త్రిపుర తాండవం
7. సంహార తాండవం… 

ఇందులో ఉమా తాండవం, గౌరీ తాండవం చేసేటప్పుడు, నటరాజుయొక్క పాదములక్రింద రాక్షసుడుండడు. మిగిలిన 5 తాండవాల్లోనూ శివుని కుడి పాదం క్రింద అసమంజసుడనే రాక్షసుడుంటాడు. ఎత్తిన ఎడమపాదానికి, ఓషధులతోకూడిన మాలధరించి వుంటాడు. ఆ మాలని కుంచితపాదం అంటారు.

శివుడి శేరీరంపైన, మెడలో, భుజాలకూ, ముంజేతులకూ, కటిప్రదేశంలో, పాదద్వయానికీ, శిరస్సునా, వెరసి 9 సర్పాలుంటాయి. ఇవన్నీకూడా, కుండలినీ శక్తికి సంకేతాలైతే

వీటిపేర్లు వరుసక్రమంలో... 
1. అనంతుడు
2. వాసుకీ
3. శేషుడు
4. పద్మనాభుడు
5. కంబళుడు
6. శంఖపాలుడు
7. ధృతరాష్ట్రుడు
8. తక్షకుడు
9. కాళుడు.

ఈ సమస్త చరాచర జగత్తు యావత్తూ, పంచభూతాలూ, సకల జీవరాశీ, చతుర్దశ భువనాలూ,  గ్రహ, నక్షత్రమండలాలన్నీ కూడా వాస్తవానికి అచేతనావస్థలోనే వుంటాయి. ఇవన్నీకూడా శివతాండవంచేత చేతనత్వంకలిగి, కదలికలకు లోనవ్వడానికి కారణహేతువే, శివతాండవంయొక్క ఆంతర్యం.

కాస్మిక్ డాన్స్అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం గతిశీలక, స్థిరమైన శక్తి ప్రవాహమే. అందులో అయిదు శాశ్వత శక్తులు, అంటే, సృష్టి, స్థితి, లయం, మాయ, విముక్తి ఉంటాయి. శివుడు చేసే రుద్రతాండవం, లయానికి సంబంధించింది. అందులో అగ్ని కీలలూ మెరుపులూ ఉరుములతో, విశ్వమంతా వ్యాపించి, సూర్యునీ చంద్రునీ గ్రహగోళాలను కూడా చెదరగొట్టి, వ్రేలాడే  శిరోజాలతో, నుదుట విభూతితో, త్రిశూలం, మద్దెలతో, ఎడమకాలు పైకెత్తి, అజ్ఞాన రాక్షసునిపై, సమతౌల్యంతో నిలబడి, చేతుల, కాళ్ళపై సర్పాలాడుతూ, అల్లినట్లున్న జటాజూటం అహంకారానికి ప్రతీకగా, శివుడు తాండవ నృత్యం చేస్తాడు. కుడి చేతిపైభాగంలో ఢమరుకం స్త్రీపురుష కీలక సూత్రానికి భాష్యంగా, క్రిందిభాగం అభయ ప్రదానంగా ఉంటుంది. చేతిలోని, లేక శిరసుపై కపాలం, మృత్యువుపై విజయానికి సంకేతం. జటాజూటంలోని గంగ, పవిత్ర జలానికి సంకేతం. శివుని త్రినేత్రం, నిత్యజాగృతికీవిజ్ఞానానికీ సంకేతం. అంతమాత్రమేకాదు, అదుపుతప్పి, ప్రకృతి విలయానికి పాల్పడే వారిని దహించే అగ్నికూడా.

శివతాండవంలో, ఉధృతస్థితి గురించి పైన తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్యం అనే సున్నితమైన నాట్యం గురించి తెలుసుకొందాం. దీనినే, ఆనంద తాండవం, అంటారు. తాండవంలో, సర్వం లయం చెందగానే, లాస్యం, లేక ఆనంద తాండవంలో, సృష్టి జరుగుతుంది. ఈ రెండు రూపాల శివ తాండవం, మనకు  చిదంబరం, నటరాజ దేవాలయంలో కనిపిస్తుంది. చిత్ అనేది అంబరంగా, అంటే, ఆకాశంగా ఉన్నదే చిదంబరం. అంటే, మనస్సూ, లేక బుద్ధీ, ఆకాశంగా కలదన్నమాట. అనగా, ఇది హృదయం లోని చైతన్య కేంద్రానికి ప్రతీక.

శివుడూ లేక బ్రహ్మం, విశ్వ చైతన్యానికి ప్రతీక. శివుని శరీరమంతా ప్రాకుతూ ఉండే సర్పాలు, మానవ శరీరం లోని నాడీ సముదాయాలే. కుండలినీశక్తి కేంద్రాలే, ప్రతిమానవునిలో ఉండేవే. ఈ కుండలినిని మేలుకొల్పటం అంటే, ఏడు శక్తిచక్రాలను ఉద్దీపనం చేయటమే. సాత్విక, రాజస, తామస గుణాలు, ఒకదానితో ఒకటి కలసి, ఈ విశ్వంలో ప్రాణి రూపాలను సృష్టిస్తాయని, భగవద్గీతలో చెప్పబడింది.

దైవీతత్త్వం, తొమ్మిదిభాగాలుగా విభజింపబడుతుంది. కానీ, అందులో ఎనిమిది, అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, బుద్ధి, అహంకారాలను మాత్రమే  మనం అవగతం చేసుకోగలుగుతున్నాం. తొమ్మిదో దైవీశక్తి మాత్రం, సృష్టి వైచిత్రంలో శాశ్వతంగా కప్పి వేయబడింది.

1972లో Fritjof Capra అనే రచయిత, తన ‘The Tao of Physics’ పుస్తకం లో, వేదవిజ్ఞానాన్నీ, ఆధునిక శాస్త్రాన్ని, తులనాత్మకంగా పరిశీలించి, భారతదేశంలో చెప్పబడిన శాస్త్రీయ విజ్ఞానం అంతా, ప్రతీకాత్మకమైనదన్నాడు. ’’ప్రతి ఉపపరమాణువు అంటే, సబ్ అటామిక్ పార్టికల్ శక్తి, నాట్యం చేస్తుంది. తానే శక్తి నాట్యమౌతు౦దికూడా. సృష్టి కార్యంలో ఇది సృష్టి లయల స్థిర, నిరంతర, శాశ్వత  ప్రవాహ విధానం. కనుక, ఆధునిక, భౌతిక శాస్త్ర వేత్తలకు, శివ తాండవం, ఉపపరమాణువు నాట్యమే.

2004లో, జెనీవాలో జరిగిన ’యూరోపియన్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్‘ లో, రెండు మీటర్ల నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాండవ నాట్యం చేసే ఈ శివుని విగ్రహం, సృష్టి, లయల వలయానికి ప్రతీక గానేకాక, సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క గతిశక్తికి సంకేతంఅనీ, ఇదే విశ్వసృష్టికి  ఆధారమని, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ భావిస్తున్నారు. జై నటరాజ, జైజై నటరాజ. దీనికి ఆధారం రచయిత కే.పి. శశిధరన్ వ్యాసం ‘విస్పరింగ్ మైండ్‘.

కొసమెరుపు...

ప్రతిరోజూ జరిగే సంధ్యాతాండవానికి ముందు కొద్ది క్షణాలకాలం, సాంగ, సకుటుంబ, సపరివార, సశక్తీ, వాహన సమేతంగా, శ్రీశైలక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు పాదంమోపుతాడు. శ్రీశైలక్షేత్రదర్శనార్ధం వెళ్ళే  భక్తులేవరైనాసరే, ఆ పరమేశ్వరుడి కృపాకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరించాలనుకుంటే, విధిగా, సంధ్యాసమయంలో, శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఉండితీరాలి.

శుభం భూయాత్...

పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ శ్రీవిద్యాగణేశానంద భారతీ స్వామీజీ చెప్పిన అద్భుత విషయాలు...

16 March, 2019

చిత్రగుప్తుడు



చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు.మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ, నలుగురు కొడుకులు.వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా.రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ, ఎనిమిదిమంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్‌, హిమవన్‌, చిత్ర్‌చారు,అరుణ, జితేంద్రలు. కూతుళ్లు ఎనిమిది మంది. వారి పేర్లు భద్రకాళిని, భుజ్‌ గాక్షి, గడ్‌ కీ, పంకజాక్షి, కొకల్సూత్‌, సుఖ్‌ దేవి, కామ కాల్‌, సౌభాగ్యినిలు.


OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/EFyJEg

* వేదాలలో

వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. యమధర్మరాజు మనుషులు చేసిన పాపాలు, పుణ్యాల గూర్చి తన వద్ద సమాచారం అస్పష్టంగా ఉందని బ్రహ్మతో మొరపెట్టుకుం టాడు. అపుడు బ్రహ్మ చిత్రగుప్తుడిని సృష్టిస్తాడు. పద్మ పురాణంలో చిత్రగుప్తుడు యమధర్మరాజు మనుషులు చేసిన మంచిచెడు విషయాల రికార్డు తయారు చేశాడు. భవిష్యపురాణంలో చిత్రగుప్తుడి సంతానం కాయస్త్‌ పేరిట భూలోకాన పరిఢవిల్లుతుంది. విజ్ఞాన తంత్ర కూడా అదే విషయాన్ని చెబుతుంది.

* చిత్రగుప్తుడి పూజా సామాగ్రి


చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్‌, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.



* అకాలమృత్యువును జయించొచ్చు



వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు. అకాల మృత్యువు వల్ల ఆ కుటుంబం దిక్కులేకుండా పోతుంది. వారి మీద ఆధారపడ్డ వారంతా అనాథలవుతారు. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.


పుట్టినవారు గిట్టక మానరు కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు కొంతవరకు సహకరిస్తాడని భక్తుల నమ్మకం. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో అకౌంటెంట్‌ లేదా రికార్డ్‌ కీపర్‌. మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి వద్ద ఉంటుంది.పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకెళ్తాడన్న ప్రచారం ఉండనే ఉంది.

08 March, 2019

Amazing Facts about Lord Vishnu’s Visit to Mrityu Loka! | శ్రీ మహా విష్ణువు మృత్యులోక సందర్శన | M Planet Leaf


Amazing Facts about Lord Vishnu’s Visit to Mrityu Loka! - శ్రీ మహా విష్ణువు మృత్యులోక సందర్శనకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా?  - M Planet Leaf (MPL) Exclusive Videos

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE TO CHAT ON YOUTUBE: https://bit.ly/2J2ZeOL

Lord Vishnu once thought of visiting the Mrityu Loka. As he discussed it with Goddess Lakshmi, she expressed her wish of accompanying him to the Mrityu Loka.

However, Lord Vishnu said it was not safe for her to go to that place since she did not know all the rules of the place. However, Goddess Lakshmi still requested him to take her along. 

Seeing that Goddess Lakshmi was desperate enough, he asked her to follow all his instructions there without fail. He said that she should not violate any rule and should also not take any decision on her own. Lest unwanted situations might arise. The Goddess consented and both proceeded towards Mrityu Loka. Following his orders diligently, the Goddess just quietly walked observing the surroundings as Lord Vishnu did. After covering some distance, Lord Vishnu told her to wait there only until he came back. The Goddess agreed to this.

However, when it had become a long time since Lord Vishnu had left, she slowly started moving towards the direction in which Lord Vishnu had gone. At some distance, she saw a mustard field. Looking beautiful with yellow flowers, the field attracted Goddess Lakshmi. She forgot the instructions of Lord Vishnu and went inside the field. She plucked a flower and put it in her hair.

She walked a little more and saw a beautiful garden of fruits. She plucked one fruit and ate it. At once, she realised that Lord Vishnu was coming towards her from the opposite direction. It was just then she realised that she was told not to take any decision all by herself.

As Lord Vishnu came, he told her that the field was just an illusion and that it represented the field of a farmer on earth, who was a very good humane and generous person. He also told her that whosoever took fruits from his farm without his due permission would get the punishment of serving the farmer's needs for twelve years. Thus Goddess Lakshmi was asked to stay in the farmer's house for twelve years.

During these twelve years, the farmer grew very rich and prosperous; Goddess Lakshmi had blessed him and was staying with his family. When the twelve years were over and the Goddess had to leave his house, he thanked the Goddess but asked her to stay a little longer.

However, Goddess Lakshmi said that in order to keep getting her blessings, he should, on the day of Ekadashi, clean the house properly and perform a Puja before her idol, after lighting a lamp. The farmer did as told and thus got the blessings of the Goddess for another one year. This way he continued celebrating this Trayodashi every year and named it as Dhan Trayodashi - or Dhan Teras.

Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#MPlanetLeaf #VoiceofMaheedhar #MaheedharsPlanetLeaf #MPL #PlanetLeaf #PMBTV

Amazing Facts Significance of Margasira Month శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత తెలుసా? M Planet Leaf


Amazing Facts Significance of Margasira Month! - శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత మీకు తెలుసా? MPlanetLeaf (MPL) Exclusive Videos

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/ZTwU1K

Agrahāyaṇa or Mārgaśīrṣa, (Hindi: अगहन - agahana; मार्गशीर्ष - Mārgaśirṣa) is a month of the Hindu calendar. In India's national civil calendar, Agrahāyaṇa is the ninth month of the year, mostly beginning on 18 November and ending on 18 December. Since Vedic times, this month is known as Mārgaśīrṣa after the Nakṣatra (asterisms) Mṛgaśiras. In Tamil, the month is known as Maargazhi.

The word Agrahāyaṇa means the month of Ayana or Equinox (agra=first + ayana = travel of the sun, equinox). The aligning of this name with the Mṛgaśiras Nakṣatra (lambda orionis), gives rise to speculation that this name was given when the sun was near Orion at the time of vernal equinox, i.e. around 7000 years ago.

In lunar religious calendars, Agrahāyaṇa may begin on either the new moon or the full moon around the same time of year, and is usually the 9th month of the year.

In solar religious calendars, Agrahāyaṇa/Maarkazhi begins with the Sun's entry into Sagittarius, and is the 9th month of the year.

Vaikuṇṭha Ekādaśī, the Ekādaśī (i.e. 11th lunar day) of this Mārgaśīṣa month, is celebrated also as Mokṣadā Ekādaśī. The 10th Canto, 22nd Chapter of Bhāgavata Purāṇa, mentions young marriageable daughters (gopis) of the cowherd men of Gokula, worshiping Goddess Kātyāyanī and taking a vrata or vow, during the entire month of Mārgaśīṣa, the first month of the winter season (Śiśira), to get Śrī Kṛṣṇa as their husband.

Bhairava Ashtami falls on Kṛṣṇa Pakṣa Aṣṭamī of this month of Mārgaśīṣa. On this day it is said that Lord Śiva appeared on earth in the fierce manifestation (avatāra) as Śrī Kālabhairava. This day is commemorated with special prayers and rituals.

In Tamil Nadu during this month of "marghaazi" ladies make "koolams" or "rangoli" early in the morning during 4 - 5 o' clock.

Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #PlanetLeaf #PMBTV #MPL

Actual Facts Behind The Death of Jarasandha | జరాసంధుడి వధ వెనుక అసలు వాస్తవాలు! | M Planet Leaf


Actual Facts Behind The Death of Jarasandha - జరాసంధుడి వధ వెనుక అసలు వాస్తవాలు! - Maheedhar's Planet Leaf (mplanetleaf - MPL)  Videos Exclusive

OUR LINKS:

►SUBSCRIBE TO MPLANETLEAF :- https://goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM :- https://goo.gl/ZTwU1K

According to the Hindu epic Mahabharata, Jarasandha (Sanskrit: जरासन्ध) was the king of Magadha. He was a descendant of King Brihadratha, the founder of the Barhadratha dynasty of Magadha. He was also a great devotee of the Hindu god Shiva. He was a great senapati but he is generally held in a negative light owing to his enmity with the Yadava clan in the Mahabharata.

The word Jarasandha is a combination of two Sanskrit words, Jara (जरा) and sandha (सन्ध), "joining". Jara was a demoness who put the two halves of Jarasandha together after finding them by a tree. In return for saving Brihadratha's son, he was named Jarasandha after her. The meaning of Jarasandha is 'the one who is joined by Jara'.

Jarasandha's father king Brihadratha was married to the twin daughters of the King of Kashi. Brihadratha loved both his wives equally, but had no sons. Once sage Chandakaushika visited his kingdom and gave a mango to the king as a boon. The king divided the mango equally and gave to his both the wives. Soon, both wives became pregnant and gave birth to two halves of a human body. These two lifeless halves were very horrifying to view. So, Brihadratha ordered these to be thrown in the forest. A Rakshasi (demoness) named Jara (or Barmata) found the two pieces and held each of them in her two palms. Incidentally, when she brought both of her palms together, the two pieces joined giving rise to a living child. The child cried loudly which created panic for Jara. Not having the heart to eat a living child, the demoness gave it to the king and explained to him all that had happened. The father was overjoyed to see him.

Chandakaushika arrived at the court and saved the child. He prophesied to Brihadratha that his son would be specially gifted and would be a great devotee of the god Shiva.

Karna helped Duryodhana marry the Princess Bhanumati of Kalinga. Duryodhana abducted Princess Bhanumati from her Swayamvara ceremony in a chariot and Karna fought with the rest of the suitors. Many legendary rulers like Shishupala, Jarasandha, Bhishmaka, Vakra, Kapotaroman, Nila, Rukmi, Sringa, Asoka, Satadhanwan etc. were defeated by Karna and Duryodhana. The ashamed Jarasandha, later challenged Karna to a one-on-one fight. Karna and Jarasandha fought continuously with different weapons until Karna defeated Jarasandha by trying to tear him apart during a wrestling fight. Jarasandha conceded defeat and Karna spared his life. Jarasandha gifted the city of Malini to Karna as a token of appreciation. The victory over Jarasandha made Karna famous on all over the world.

Jarasandha had also participated in the Swayamvara of Draupadi, and after being unable to lift the bow, left the place.

When Yudhishthira was trying to conduct Rajasuya ritual, Krishna told him that Jarasandha should be killed to conduct the ritual. Thus Krishna took Bhima and Arjuna to Magadha, disguising themselves as Brahmins. Jarasandha, though finding them suspicious, welcomed the three. Later, when they revealed themselves, they challenged Jarasandha to have a wrestling. Jarasandha took Bhima as his opponent. The fight continued for a long time, and no one became the victor. Finally, Krishna gave a signal to Bhima, by tearing a leaf and dropping it to sides. Bhima took it as a signal and tore Jarasandha's body into two pieces, thus killing him.

Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...

#MPlanetLeaf #VoiceofMaheedhar #MaheedharsPlanetLeaf #PlanetLeaf #PMBTV