Ads

26 November, 2020

కార్తీక పురాణం! (ఏకాదశాధ్యాయము - పదకొండవ రోజు పారాయణము)


కార్తీక పురాణం! (ఏకాదశాధ్యాయము - పదకొండవ రోజు పారాయణము)

మ౦థరుడు - పురాణ మహిమ:

ఓ జనక మహారాజా! యీ కార్తిక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి, అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను, తనివి తీరదు. ఈ మాస మందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల, చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పటణం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్ధగా అలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించు చు, మద్య మా౦సాది పానీయాలు సేవించు చూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపరదన నాదికములను ఆచరములును పాటింపక దురాచారుడై మెలుగు చుండెను. అతని భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంత మంతురాలు, భర్త యెంత దుర్మార్గుడ యిననూ, పతనే దైవము గనెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతి వ్రతా ధర్మమును నిర్వర్తించు చుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంట వాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. 

ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించు చెండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవు చుండ నతనిని భయ పెట్టి కొట్టి ధన మపహరిం చుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమిపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపో యినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని, దుఖిoచుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్ళకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గానీ, సంతతిగానీ లేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జివించుచున్న దానను. కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు"మని బ్రతిమాలుకొనెను. ఆమె విన్నపమునకు, ఆచార మునకు ఆ ఋషి సంతసించి "అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకొన వద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చెదను. నివు ప్రమిదను, వత్తిని తీసికొని రావలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే, అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి, శుబ్రముచేసి, గోమయముచే అలికి ముగ్గులు పెట్టి, తానే స్వయముగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి, దీపారాధన చేసెను. 

అటు తరువాత యింటికి వెడలి, తనకు కనిపించిన వారి నెల్ల "ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి మంతము పురాణమును వినెను. ఆనాటినుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు, కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే విష్ణుదూతలు వచ్చి, విమాన మేక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి. కానీ, ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన, కొంచము దోషముండుట చేత, మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో బాధ పడుచున్న తన భర్తను జూచి "ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక బాధ పడుచున్నారు. కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు"డని ప్రాధేయ పడెను. 

అంత విష్ణుదూతలు "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు, స్నాన సంధ్యాదులు మాని, పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా, బ్రాహ్మణుడైననూ, అతడు కూడా ధనాశచే, ప్రాణహితుని చంపి, ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు, పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడిగా జన్మించిననూ, అనేక అత్యాచారములు చేసి, ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణచేసినాడుగాన, పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురూ నరక బాధలు పడుచున్నారు." అని వారి చరిత్రలు చెప్పిరి. 

అందులకు ఆమె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు, మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు"డని ప్రార్ధించగా, అందులకా దూతలు "అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును, ఆ విప్రునికి ధారపోసినచో, వారికి మోక్ష ఫలము కిరాతకునకునని చెప్పుగా, అందులకామె అట్లే ధార పోసెను. అ నలుగురును ఆమె కడకువచ్చి విమాన మెక్కి, వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓ రాజా! కార్తిక మాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన, ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'ఏకాదశాధ్యాయము - పదకొండవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/Ugz4ljMJBUvuWAUgxL94AaABCQ

No comments: